ఐపీఎల్ 2018 సీజన్ షెడ్యూల్ తయారి కీలక మార్పులతో చివరి దశకి చేరుకుంది. టోర్నీ తొలి మ్యాచ్, ఫైనల్ ఆనవాయితీ ప్రకారం గత ఏడాది విజేతగా నిలిచిన జట్టు సొంత మైదానంలోనే జరగనున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. 2017 సీజన్లో ముంబయి ఇండియన్స్ విజేతగా నిలిచిన నేపథ్యంలో ఏప్రిల్ 7న తొలి మ్యాచ్, మే 27న ఫైనల్.. వాంఖడే స్టేడియంలో జరగనుంది. అయితే.. టోర్నీ మొత్తం మ్యాచ్ల టైమింగ్లో కూడా కౌన్సిల్ మార్పులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటి వరకు ముగిసిన పది సీజన్లలో ఒక మ్యాచ్ సాయంత్రం 4 గంటలకి ఆరంభమైతే.. రెండో మ్యాచ్ రాత్రి 8 గంటలకి మొదలయ్యేది. కానీ.. బ్రాడ్కాస్టర్స్ ఒత్తిడితో 2018 సీజన్లో తొలి మ్యాచ్ని సాయంత్రం 5.30 గంటలకి.. రెండో మ్యాచ్ని 7 గంటలకే ప్రారంభించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొన్ని మ్యాచ్లు అర్ధరాత్రి వరకు కొనసాగడం.. 4 గంటలకి మొదలయ్యే మ్యాచ్లకి వీక్షకుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఈ మేరకు బ్రాడ్కాస్టర్స్ మార్పులు సూచించారట. దీంతో వారి ఒత్తిడికి కౌన్సిల్ తలొగ్గి మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే.. రెండు మ్యాచ్లు ఒకే సమయంలో జరగనున్నాయి. దీంతో ఈ ప్రతిపాదనని ఫ్రాంఛైజీలు, ప్రకటన సంస్థలు వ్యతిరేకించే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు ముగిసిన పది సీజన్లలో ఒక మ్యాచ్ సాయంత్రం 4 గంటలకి ఆరంభమైతే.. రెండో మ్యాచ్ రాత్రి 8 గంటలకి మొదలయ్యేది. కానీ.. బ్రాడ్కాస్టర్స్ ఒత్తిడితో 2018 సీజన్లో తొలి మ్యాచ్ని సాయంత్రం 5.30 గంటలకి.. రెండో మ్యాచ్ని 7 గంటలకే ప్రారంభించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొన్ని మ్యాచ్లు అర్ధరాత్రి వరకు కొనసాగడం.. 4 గంటలకి మొదలయ్యే మ్యాచ్లకి వీక్షకుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఈ మేరకు బ్రాడ్కాస్టర్స్ మార్పులు సూచించారట. దీంతో వారి ఒత్తిడికి కౌన్సిల్ తలొగ్గి మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే.. రెండు మ్యాచ్లు ఒకే సమయంలో జరగనున్నాయి. దీంతో ఈ ప్రతిపాదనని ఫ్రాంఛైజీలు, ప్రకటన సంస్థలు వ్యతిరేకించే అవకాశం ఉంది.