యాప్నగరం

IPL 2019: రాజస్థాన్ కోచ్‌గా ప్యాడీ ఆప్టన్..!

2013 నుంచి 2015 ఐపీఎల్ సీజన్ వరకూ రాజస్థాన్ రాయల్స్ హెడ్‌ కోచ్‌గా పనిచేసిన ఆప్టన్.. తాను బాధ్యతలు తీసుకున్న తొలి ఏడాదే జట్టుని ప్లేఆఫ్ చేర్చాడు.

Samayam Telugu 13 Jan 2019, 6:28 pm
ఐపీఎల్ 2019 సీజన్‌ కోసం ఇటీవల జరిగిన ఆటగాళ్ల వేలంలో రూ. 13.80 కోట్లు ఖర్చుచేసి 9 మంది క్రికెటర్లని కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ.. టీమ్ కోచింగ్ స్టాఫ్‌లోకి మళ్లీ ప్యాడీ ఆప్టన్‌ని తీసుకుంది.
Samayam Telugu Paddy-Upton-1024


2013 నుంచి 2015 ఐపీఎల్ సీజన్ వరకూ రాజస్థాన్ రాయల్స్ హెడ్‌ కోచ్‌గా పనిచేసిన ఆప్టన్.. తాను బాధ్యతలు తీసుకున్న తొలి ఏడాదే జట్టుని ప్లేఆఫ్ చేర్చాడు. అయితే.. ఆ తర్వాత ఫిక్సింగ్ కారణంగా రాజస్థాన్ రాయల్స్ టీమ్‌పై రెండేళ్లు నిషేధం పడగా.. గత ఏడాదే మళ్లీ ఐపీఎల్‌లోకి ఆ జట్టు పునరాగమనం చేసింది.

2018 ఐపీఎల్ సీజన్‌లో ఆ జట్టు నిరాశపరిచింది. బాల్ టాంపరింగ్ కారణంగా కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌పై నిషేధం వేటు పడటంతో అతను గత సీజన్‌కి దూరమవడం ఆ జట్టు ప్రదర్శనని దారుణంగా దెబ్బతీసింది. ఈ ఏడాది కూడా గాయం కారణంగా అతను ఆడటంపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో.. మళ్లీ పాత కోచ్‌ని తీసుకురావడం ద్వారా జట్టులో ఆత్మస్థైర్యాన్ని నింపాలని ఫ్రాంఛైజీ యోచిస్తోంది. ఈ మేరకు ప్యాడీ ఆప్టన్‌ని హెడ్ కోచ్‌గా నియమిస్తూ ఈరోజు నిర్ణయం తీసుకుంది.

భారత్ జట్టుకి కూడా 2008 నుంచి 2011 వరకూ సహాయ కోచ్‌గా ఆప్టన్ పనిచేశాడు. దీంతో.. ఆ అనుభవం కూడా అక్కరకొస్తుందని రాజస్థాన్ రాయల్స్ భావిస్తోంది. మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభంకానుండగా.. మే రెండో వారంలో ముగిసే అవకాశముంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.