యాప్నగరం

ఐపీఎల్ ఎఫెక్ట్.. భారత్‌లో జింబాబ్వే టూర్ రద్దు..?

భారత్ గడ్డపై 2002లో చివరిసారి జింబాబ్వే ద్వైపాక్షిక సిరీస్ ఆడింది. ఆ తర్వాత 2016లో టీ20 ప్రపంచకప్‌ కోసం భారత్‌కి వచ్చింది తప్ప.. సిరీస్ ఆడలేదు..!

Samayam Telugu 13 Jan 2019, 7:47 pm
ఐపీఎల్ 2019 సీజన్‌కి ముందు భారత్‌లో పర్యటించాలని ఆశించిన జింబాబ్వే టీమ్‌కి చుక్కెదురయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ ఆడుతున్న భారత్ జట్టు.. ఈ నెల 18న పర్యటన ముగించుకుని న్యూజిలాండ్‌కి వెళ్తుంది. అక్కడ 23 నుంచి ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడి.. ఫిబ్రవరి 10న టూర్‌ ముగించుకుని భారత్‌కి వస్తుంది. వెంటనే ఫిబ్రవరి 24 నుంచి మార్చి 13 వరకూ మళ్లీ ఆస్ట్రేలియాతో ఇక్కడ రెండు టీ20లు, ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది.
Samayam Telugu 300


మార్చి 13 తర్వాత జింబాబ్వే‌తో భారత్ ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడాలని బీసీసీఐ తొలుత షెడ్యూల్‌ని రూపొందింది. కానీ.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ 2019 సీజన్‌ని రెండు వారాలు ముందుకు జరిపిన బీసీసీఐ.. మార్చి 23 నుంచే టోర్నీ ప్రారంభమవుతుందని ఇటీవల ప్రకటించింది. దీంతో.. కేవలం 10 రోజుల వ్యవధిలో జింబాబ్వేతో సిరీస్ ఆడటం కష్టంకానుండటంతో ఆ పర్యటనని రద్దు చేయాలని బీసీసీఐ యోచిస్తోంది. అలాకాకుండా తప్పదు అనుకుంటే.. ఒక వన్డే, ఒక టీ20తో పర్యటనని సరిపెట్టాలని కూడా చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

భారత్ గడ్డపై 2002లో చివరిసారి జింబాబ్వే ద్వైపాక్షిక సిరీస్ ఆడింది. ఆ తర్వాత 2016లో టీ20 ప్రపంచకప్‌ కోసం భారత్‌కి వచ్చింది తప్ప.. సిరీస్ ఆడలేదు..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.