యాప్నగరం

చెన్నై ఆటగాళ్లకి రెండోసారీ కరోనా నెగటివ్.. MI vs CSK‌కి లైన్ క్లియర్

ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 12 సీజన్లు ముగియగా.. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, గత సీజన్ రన్నరప్ తలపడటం ఆనవాయితీగా వస్తోంది. కానీ.. ఐపీఎల్ 2020 సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లో..?

Samayam Telugu 4 Sep 2020, 1:59 pm
ఐపీఎల్ 2020 సీజన్‌‌ని సెప్టెంబరు 19 నుంచి ప్రారంభించేందుకు మార్గం సుగుమమైంది. గత వారం ఇద్దరు చెన్నై సూపర్ కింగ్స్‌‌ ఆటగాళ్లతో పాటు.. ఆ టీమ్‌లోని 11 మంది స్టాఫ్ కరోనా వైరస్ బారినపడగా.. తాజాగా రెండోసారి నిర్వహించిన కరోనా టెస్టులోనూ వారికి నెగటివ్ వచ్చింది. దాంతో.. సెప్టెంబరు 19న చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య ఫస్ట్ మ్యాచ్ జరగడం ఖాయమైంది.
Samayam Telugu MI vs CSK
ముంబయి VS చెన్నై


ఐపీఎల్‌లో ఫస్ట్ మ్యాచ్ సాధారణంగా డిఫెండింగ్ ఛాంపియన్‌, రన్నరప్‌గా నిలిచిన జట్ల మధ్య జరగడం ఫస్ట్ నుంచి ఆనవాయితీగా వస్తోంది. దాంతో.. ఐపీఎల్ 2019 విజేత ముంబయి ఇండియన్స్, రన్నరప్‌‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభ మ్యాచ్ జరిగేలా బీసీసీఐ ఇప్పటికే ప్రాథమికంగా షెడ్యూల్ రూపొందించింది.

కానీ.. చెన్నై జట్టులో 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో.. సెప్టెంబరు 19 నాటికి ఆ జట్టు పరిస్థితి ఎలా ఉంటుందో..? అని బీసీసీఐ గత వారం పునరాలోచనలో పడింది. ఈ క్రమంలో ఫస్ట్ మ్యాచ్‌ని ముంబయి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య నిర్వహించేందుకు ఉన్న అవకాశాల్ని కూడా పరిశీలించింది. కానీ.. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే కోలుకున్న చెన్నై టీమ్.. తాజాగా రెండోసారి కరోనా పరీక్షల్లోనూ పాసయ్యింది. దాంతో.. ఆనవాయితీ ప్రకారం విజేత vs రన్నరప్ మధ్య మ్యాచ్ తొలి మ్యాచ్ జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.