ఐపీఎల్ 2020 సీజన్ షెడ్యూల్పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఓ క్లారిటీకి వచ్చేసింది. సెప్టెంబరు 26 నుంచి ఈ టోర్నీని ప్రారంభించాలని యోచిస్తున్న బీసీసీఐ.. నవంబరు 8న ఫైనల్ జరిగేలా షెడ్యూల్ రూపొందించినట్లు వార్తలు వస్తున్నాయి. 44 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 60 మ్యాచ్ల్ని నిర్వహించనున్నారు. కానీ.. ఈ షెడ్యూల్పై టోర్నీ బ్రాడ్కాస్టర్ స్టార్స్పోర్ట్స్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం.
Read More: undefined
ఐపీఎల్ 2020 సీజన్ని శనివారం (సెప్టెంబరు 26) ఆరంభించనున్న బీసీసీఐ.. ఆదివారం (నవంబరు 8) ఫైనల్తో ముగిసేలా వీకెండ్స్లో పక్కా ప్లాన్ చేసింది. కానీ.. వారం తర్వాత అంటే నవంబరు 14న ఫైనల్ జరిగేలా చూడాలని బీసీసీఐకి స్టార్స్పోర్ట్స్ రిక్వెస్ట్ చేస్తోంది. పండగ సీజన్లో యాడ్స్ బాగా వచ్చే అవకాశం ఉండటంతో.. ఈ మేరకు బ్రాడ్కాస్టర్ రిక్వెస్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ.. నవంబరు 14న ఐపీఎల్ ఫైనల్ జరిగితే..? ఆ తర్వాత భారత్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లి.. డిసెంబరు 3 నాటికి సిరీస్ కోసం సిద్ధమయ్యే రోజులు తగ్గిపోనున్నాయి.
Read More: బంతికి ఉమ్ము రుద్దిన ఫీల్డర్.. శానిటైజ్ చేసిన అంపైర్
బీసీసీఐ వేసిన ప్లాన్ ప్రకారం.. నవంబరు 8న ఫైనల్ ముగియగానే 10న ఆస్ట్రేలియా పర్యటనకి టీమిండియా బయల్దేరి వెళ్లనుంది. కరోనా వైరస్ నేపథ్యంలో.. అక్కడ 14 రోజులు క్వారంటైన్.. ఆ తర్వాత వార్మప్ మ్యాచ్లకి తగినంత సమయం దొరుకుతుందని బీసీసీఐ భావిస్తోంది. నాలుగు టెస్టుల ఈ సిరీస్లో ఒకటి డే/నైట్ టెస్టు కూడా ఉండటంతో.. కచ్చితంగా కొన్ని రోజులు ఆ మ్యాచ్ కోసం డే/నైట్ సెషన్స్లో భారత క్రికెటర్లు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మొత్తంగా.. షెడ్యూల్పై ఒక క్లారిటీకి వచ్చేసిన బీసీసీఐ.. మార్చేందుకు సముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదని సమాచారం.
Read More: undefined
ఐపీఎల్ 2020 సీజన్ని శనివారం (సెప్టెంబరు 26) ఆరంభించనున్న బీసీసీఐ.. ఆదివారం (నవంబరు 8) ఫైనల్తో ముగిసేలా వీకెండ్స్లో పక్కా ప్లాన్ చేసింది. కానీ.. వారం తర్వాత అంటే నవంబరు 14న ఫైనల్ జరిగేలా చూడాలని బీసీసీఐకి స్టార్స్పోర్ట్స్ రిక్వెస్ట్ చేస్తోంది. పండగ సీజన్లో యాడ్స్ బాగా వచ్చే అవకాశం ఉండటంతో.. ఈ మేరకు బ్రాడ్కాస్టర్ రిక్వెస్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ.. నవంబరు 14న ఐపీఎల్ ఫైనల్ జరిగితే..? ఆ తర్వాత భారత్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లి.. డిసెంబరు 3 నాటికి సిరీస్ కోసం సిద్ధమయ్యే రోజులు తగ్గిపోనున్నాయి.
Read More: బంతికి ఉమ్ము రుద్దిన ఫీల్డర్.. శానిటైజ్ చేసిన అంపైర్
బీసీసీఐ వేసిన ప్లాన్ ప్రకారం.. నవంబరు 8న ఫైనల్ ముగియగానే 10న ఆస్ట్రేలియా పర్యటనకి టీమిండియా బయల్దేరి వెళ్లనుంది. కరోనా వైరస్ నేపథ్యంలో.. అక్కడ 14 రోజులు క్వారంటైన్.. ఆ తర్వాత వార్మప్ మ్యాచ్లకి తగినంత సమయం దొరుకుతుందని బీసీసీఐ భావిస్తోంది. నాలుగు టెస్టుల ఈ సిరీస్లో ఒకటి డే/నైట్ టెస్టు కూడా ఉండటంతో.. కచ్చితంగా కొన్ని రోజులు ఆ మ్యాచ్ కోసం డే/నైట్ సెషన్స్లో భారత క్రికెటర్లు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మొత్తంగా.. షెడ్యూల్పై ఒక క్లారిటీకి వచ్చేసిన బీసీసీఐ.. మార్చేందుకు సముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదని సమాచారం.