యాప్నగరం

ధోనీ.. ప్రత్యర్థి కెప్టెన్‌ని బెదరగొడతాడు: హస్సీ

మ్యాచ్‌లను గెలుపుగా ముగించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా..? ఆఖరి వరకూ ఎన్ని డ్రామాలు నడిచినా.. చివరి ఓవర్‌లో ధోనీ క్రీజులో ఉంటే గెలుపు ఖాయమని రికార్డులు చెప్తున్నాయి.

Samayam Telugu 14 Apr 2020, 4:45 pm
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఓ వ్యూహం ప్రకారం మ్యాచ్‌లను ముగిస్తుంటాడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ హస్సీ వెల్లడించాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోనీ కెప్టెన్సీలో ఆడిన హస్సీ.. డెత్ ఓవర్లలో ధోనీ ఎలా బ్యాటింగ్ చేస్తాడో..? వివరించాడు. 2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. టోర్నీలో ఆడిన ప్రతి సీజన్‌లోనూ ప్లేఆఫ్‌కి చేరిన చెన్నై సూపర్ కింగ్స్ మూడు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
Samayam Telugu MS Dhoni IPL 2019


Read More: ఒక్క ఫోన్‌ కాల్ దూరంలో ధోనీ రీఎంట్రీ: చోప్రా

‘‘క్రికెట్ ప్రపంచంలోనే మహేంద్రసింగ్ ధోనీ గొప్ప ఫినిషర్. మ్యాచ్ సమయంలో కామ్‌గా వ్యూహాలు రచించే ధోనీ.. ఫస్ట్‌లోనే ప్రత్యర్థి టీమ్ కెప్టెన్‌ని బెదరగొడతాడు. అతనిలో నమ్మశక్యంకాని పవర్ దాగి ఉంది. ఎప్పుడు బంతిని బౌండరీ దాటించాలో..? ధోనీకి బాగా తెలుసు. ఆశించినట్లుగా అతను హిట్టింగ్ చేయగలడు కూడా. అతని ఆత్మవిశ్వాసం అలాంటిది. వ్యక్తిగతంగా ధోనీపై ఉన్న నమ్మకం నాపై నాకు కూడా లేదు. ఒక ఓవర్‌లో 12-13 పరుగులు ఎలా చేయాలో..? ధోనీ నుంచే నేను నేర్చుకున్నాను. ఆఖరి వరకూ వెయిట్ చేయడం ధోనీ స్టయిల్. ఎందుకంటే..? ఆ సమయంలో ఒత్తిడి తన కంటే బౌలర్లపైనే ఎక్కువగా ఉంటుందని అతనికి బాగా తెలుసు’’ అని మైకేల్ హస్సీ వెల్లడించాడు.

Read More: ధోనీ ఎందుకింత సాగదీత..? అక్తర్ సూటిప్రశ్న

మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంకావాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా ఏప్రిల్ 15కి వాయిదాపడింది. కానీ.. ప్రధాని నరేంద్ర మోడీ లాక్‌డౌన్‌ని మే 3 వరకూ పొడిగించడంతో ఈ ఏడాది ఐపీఎల్‌పై సందిగ్ధత నెలకొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.