యాప్నగరం

ఐపీఎల్‌లో భారత క్రికెటర్లే ఢిల్లీకి బలం

ఐపీఎల్‌లోని జట్లు ఎక్కువగా విదేశీ క్రికెటర్లపై అతిగా ఆధారపడుతుంటాయి. కానీ.. ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఎక్కువగా భారత క్రికెటర్ల ప్రదర్శనతో గెలుస్తుంటుంది.

Samayam Telugu 27 Feb 2020, 6:48 pm
ఐపీఎల్ 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ప్రధాన బలం భారత క్రికెటర్లేనని ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. గత ఏడాది డిసెంబరులో ఐపీఎల్ 2020 సీజన్‌కి సంబంధించిన ఆటగాళ్ల వేలం జరగగా.. రూ. 50 లక్షల కనీస ధరతో వేలానికి వచ్చిన మోహిత్ శర్మని అదే ధరకి ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2019 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడిన ఈ పేసర్‌ని.. గత ఏడాది చివర్లో సీఎస్‌కే ఫ్రాంఛైజీ వేలంలోకి వదిలేసిన విషయం తెలిసిందే.
Samayam Telugu DC 2020


Read More: IPL 2020: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ మార్పు

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, శిఖర్ ధావన్, రవిచంద్రన్ అశ్విన్, పృథ్వీ షా, అజింక్య రహానె, ఇషాంత్ శర్మ, మోహిత్ శర్మ, అమిత్ మిశ్రా తదితర భారత క్రికెటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో.. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ హాట్ టైటిల్ ఫేవరెట్‌ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ 2019 సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆ జట్టు ప్లేఆఫ్‌కి చేరింది. కానీ.. కొద్దిలో ఫైనల్‌కి చేరే అవకాశాన్ని చేజార్చుకుంది.

IPL 2020: కొత్త వేదికలో రెండు RR మ్యాచ్‌లు
‘ఐపీఎల్ టీమ్‌లో భారత క్రికెటర్ల సంఖ్య ఎక్కువగా ఉంటే.. టైటిల్ గెలవడం సులువవుతుంది. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఎక్కువ మంది భారత క్రికెటర్లు ఉన్నారు. అందులోనూ యువ క్రికెటర్లు, సీనియర్ ఆటగాళ్లు సమపాళ్లలో ఉండటం మరింతగా కలిసొచ్చే అంశం’ అని మోహిత్ శర్మ వెల్లడించాడు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. మ్యాచ్‌ ఆడే తుది జట్టులో కేవలం నలుగురు విదేశీ క్రికెటర్లకి మాత్రమే చోటివ్వాలి. ఇక మిగిలిన ఏడుగురు భారత క్రికెటర్లు అయ్యుండాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.