యాప్నగరం

ఐపీఎల్ ముంగిట క్వారంటైన్‌లోనూ కోహ్లీ కసరత్తులు

యూఏఈలో క్వారంటైన్‌లో ఉన్న క్రికెటర్లలో కొంత మంది తమకి బోర్ కొడుతోందని వీడియోలు పోస్టు చేస్తుండగా.. విరాట్ కోహ్లీ మాత్రం భిన్నంగా తన రెగ్యులర్‌ ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ...?

Samayam Telugu 26 Aug 2020, 8:10 pm
ఐపీఎల్ 2020 సీజన్‌‌లో ఆడేందుకు యూఏఈకి వెళ్లిన విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం ఆరు రోజుల క్వారంటైన్‌లో ఉన్నాడు. దాంతో.. జిమ్ సదుపాయాన్ని వాడుకునే అవకాశం లేకపోయింది. అయినప్పటికీ.. బాల్కనీలోనే విరాట్ కోహ్లీ తాను రెగ్యులర్‌గా చేసే ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తాజాగా ఒక వీడియోని అభిమానులతో పంచుకుంది. భారత క్రికెట్‌లోనే మెరుగైన ఫిట్‌నెస్ ఉన్న ఆటగాళ్లలో ఒకడిగా ఉన్న కోహ్లీ.. ఎక్కడ ఉన్నా.. ఎంత బిజీగా ఉన్న ఎక్సర్‌సైజ్‌ల విషయంలో మాత్రం అలక్ష్యం చూపడు.
Samayam Telugu virat kohli ( Photo: video grab)
virat kohli ( Photo: video grab)


యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ జరగనుండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌ని ఈసారి టైటిల్ విజేతగా నిలపాలని విరాట్ కోహ్లీ పట్టుదలతో కనిపిస్తున్నాడు. ఈ మేరకు ఇప్పటికే వర్చువల్‌గా టీమ్ మీటింగ్‌లు జరుపుతున్న కోహ్లీ.. రెండు రోజుల క్రితం బయో- సెక్యూర్ బబుల్ నిబంధనల విషయంలో సహచరులకి వార్నింగ్ కూడా ఇచ్చాడు.

View this post on Instagram Welcome to Captain Kohli’s b̶a̶l̶c̶o̶n̶y̶ gym. Seize the day! #PlayBold #BoldIsFit #WeAreChallengers A post shared by Royal Challengers Bangalore (@royalchallengersbangalore) on Aug 25, 2020 at 8:30pm PDT

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆడే ఆటగాళ్లందరూ ప్రస్తుతం యూఏఈలో ఆరు రోజుల క్వారంటైన్‌లో ఉండగా.. ఈ ఆరు రోజుల వ్యవధిలో మూడు సార్లు వారికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మూడింటిలోనూ నెగటివ్ వచ్చిన క్రికెటర్లని బయో- సెక్యూర్ బబుల్‌లోకి బీసీసీఐ చేర్చనుంది. ఒక్కసారి ఈ బబుల్‌లోకి క్రికెటర్ ఎంటరైన తర్వాత.. మళ్లీ వెలుపలి వ్యక్తిని ప్రత్యక్షంగా కలిసేందుకు అనుమతించరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.