యాప్నగరం

ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్‌గా ప్రవీణ్ ఆమ్రే.. రెండేళ్లు ఒప్పందం

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆఖరి మెట్టుపై బోల్తాపడిన ఢిల్లీ క్యాపిటల్స్.. 2021 సీజన్‌ కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒకప్పటి కోచ్‌ని మళ్లీ కోచింగ్ స్టాఫ్‌లోకి ఆ టీమ్‌ ఫ్రాంఛైజీ తీసుకొచ్చింది.

Samayam Telugu 6 Jan 2021, 10:05 pm
ఐపీఎల్ 2020 సీజన్‌‌లో ఫైనల్‌కి చేరినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి టైటిల్ కలని నెరవేర్చుకోలేకపోయింది. దాంతో.. ఐపీఎల్ 2021 సీజన్‌కి చాలా రోజుల ముందు నుంచే ప్రిపరేషన్స్‌ని ఢిల్లీ స్టార్ట్ చేసేలా కనిపిస్తోంది. భారత మాజీ క్రికెటర్, దేశవాళీ క్రికెట్‌లో కోచ్‌గా మంచి పేరున్న ప్రవీణ్ ఆమ్రేని తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కి అసిస్టెంట్ కోచ్‌గా ఆ జట్టు ఫ్రాంఛైజీ నియమించింది. గతంలో 2014-19 మధ్యకాలంలో ఢిల్లీ టీమ్‌తో కలిసి ప్రవీణ్ ఆమ్రే పనిచేశాడు. 2021, 2022 ఐపీఎల్ సీజన్లకి అతను ఢిల్లీ టీమ్‌కి అసిస్టెంట్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.
Samayam Telugu Delhi Capitals, Pravin Amre (Image Credit: Twitter)


ఐపీఎల్ 2021 సీజన్ మార్చి- మే నెలల్లో జరిగే సూచనలు కనిపిస్తుండగా.. ఫిబ్రవరి రెండో వారంలో మినీ వేలం జరగబోతోంది. దాంతో.. అట్టి పెట్టుకునే ఆటగాళ్ల జాబితాతో పాటు వేలంలోకి విడిచిపెట్టే క్రికెటర్ల లిస్ట్‌ని టోర్నీలోని అన్ని ఫ్రాంఛైజీలు సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కోచింగ్ స్టాఫ్‌లోనూ మార్పులు, చేర్పులు చేస్తున్నాయి.

భారత్ తరఫున 11 టెస్టులు, 37 వన్డేలాడిన ప్రవీణ్ ఆమ్రే.. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్‌లో కోచ్‌గా మారాడు. ముంబయి టీమ్‌కి కోచ్‌గా పనిచేసిన ప్రవీణ్ ఆమ్రే.. ఆ జట్టు మూడు రంజీ ట్రోఫీలు గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా.. చాలా మంది భారత క్రికెటర్లకి పర్సనల్‌ కోచ్‌గానూ ప్రవీణ్ ఆమ్రే పనిచేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.