ఐపీఎల్ 2018 సీజన్ ఆటగాళ్ల వేలం ఆసక్తికరంగా బెంగళూరులో శనివారం జరుగుతోంది. ఫిటెనెస్, హిట్టింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ఆటగాళ్లపైనే ఎక్కువగా ఫ్రాంఛైజీలు మొగ్గుచూపాయి. గత ఏడాది తరహాలోనే ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్ రూ. 12.5 కోట్లతో ఈ ఏడాది అత్యధిక ధరకి వేలంలో అమ్ముడుపోగా.. తర్వాత స్థానంలో భారత యువ ఓపెనర్ కేఎల్ రాహుల్ (రూ .11 కోట్లు) , మనీశ్ పాండే (రూ.11 కోట్లు), ఆస్ట్రేలియా హిట్టర్ క్రిస్లిన్ (రూ.9.6కోట్లు), మిచెల్ స్టార్క్ (రూ.9.4 కోట్లు), మాక్స్వెల్ (రూ.9కోట్లు) నిలిచారు. వీరంతా ఇప్పటికే టీ20 క్రికెట్లో తమదైన ముద్రవేసిన బ్యాట్స్మెన్.
చదవండి: ఐపీఎల్ వేలం లైవ్ అప్డేట్స్
పేలవ ఫామ్, ఫిటెనెస్లేమి కారణంగా టీమిండియా చోటు కోల్పోయిన యువరాజ్ సింగ్ రూ. 2కోట్ల ప్రాథమిక ధరకే పంజాబ్కి అమ్ముడుపోగా.. పేలవ ఫామ్తో ఉన్న టీ20 విధ్వంసక హిట్టర్ క్రిస్గేల్ ,కివీస్ హిట్టర్ మార్టిన్ గప్తిల్, భారత టెస్టు ఓపెనర్ మురళీ విజయ్, ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్. హసీమ్ ఆమ్లా తదితర క్రికెటర్లు అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో చేరిపోయారు.
ఇప్పటి వరకూ అతి తక్కువ ధరకు అమ్ముడైన ఆటగాళ్లు: * స్టువర్ట్ బిన్నీ - రూ. 50 లక్షలు * జాసన్ రాయ్ - రూ. 1.5 కోట్లు * డుప్లెసిస్ - రూ. 1.6 కోట్లు * మొయిన్ అలీ - రూ. 1.7 కోట్లు * మున్రో, యూసుఫ్ పఠాన్ - రూ. 1.9 కోట్లు.
చదవండి: ఐపీఎల్ వేలం లైవ్ అప్డేట్స్
పేలవ ఫామ్, ఫిటెనెస్లేమి కారణంగా టీమిండియా చోటు కోల్పోయిన యువరాజ్ సింగ్ రూ. 2కోట్ల ప్రాథమిక ధరకే పంజాబ్కి అమ్ముడుపోగా.. పేలవ ఫామ్తో ఉన్న టీ20 విధ్వంసక హిట్టర్ క్రిస్గేల్ ,కివీస్ హిట్టర్ మార్టిన్ గప్తిల్, భారత టెస్టు ఓపెనర్ మురళీ విజయ్, ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్. హసీమ్ ఆమ్లా తదితర క్రికెటర్లు అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో చేరిపోయారు.
ఇప్పటి వరకూ అతి తక్కువ ధరకు అమ్ముడైన ఆటగాళ్లు: * స్టువర్ట్ బిన్నీ - రూ. 50 లక్షలు * జాసన్ రాయ్ - రూ. 1.5 కోట్లు * డుప్లెసిస్ - రూ. 1.6 కోట్లు * మొయిన్ అలీ - రూ. 1.7 కోట్లు * మున్రో, యూసుఫ్ పఠాన్ - రూ. 1.9 కోట్లు.