యాప్నగరం

ధోనీ శిష్యుడ్ని వేలంలో బెంగళూరు కొనుగోలు

ఐపీఎల్ 2018 ఆటగాళ్ల వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫ్రాంఛైజీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

TNN 28 Jan 2018, 11:30 am
ఐపీఎల్ 2018 ఆటగాళ్ల వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫ్రాంఛైజీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు జరగనున్న ఈ వేలంలో తొలి రోజైన శనివారం క్రిస్ వోక్స్ (రూ. 7.4కోట్లు), ఉమేశ్ యాదవ్ (రూ.4.2 కోట్లు) రూపంలో ఫాస్ట్ బౌలర్లని ఎంచుకున్న ఆర్‌సీబీ.. ఆదివారం వేలంలో యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌ని రూ. 3.2 కోట్లతో కొనుగోలు చేసి ఆశ్చర్యపరిచింది. శనివారం రూ. 6 కోట్లతో చాహల్‌ని రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎమ్) ద్వారా బెంగళూరు దక్కించుకున్న విషయం తెలిసిందే.
Samayam Telugu ipl auction 2018 live updates washington sundar goes to rcb for 3 2 cr
ధోనీ శిష్యుడ్ని వేలంలో బెంగళూరు కొనుగోలు


ఐపీఎల్ 2017 సీజన్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన వాషింగ్టన్ సుందర్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ వెలుగులోకి వచ్చాడు. సీనియర్ స్పిన్నర్ అశ్విన్ ఆ సీజన్‌లో జట్టుకి దూరమవడంతో అతని స్థానంలో ఆడిన సుందర్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ పర్యవేక్షణలో రాటుదేలాడు. దీంతో గత ఏడాదే టీమిండియా నుంచి కూడా పిలుపొచ్చింది. శ్రీలంకతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో ఈ తమిళనాడు స్పిన్నర్ మెరిశాడు. ధోనీ సాయంతోనే తన బౌలింగ్ మెరుగైందని అప్పట్లో వాషింగ్టన్ సుందర్ చెప్పుకొచ్చాడు. దీంతో చెన్నై ఫ్రాంఛైజీ అతడ్ని కొనుగోలు చేస్తుందని అంతా భావించినా.. బెంగళూరు పోటీపడి మరీ దక్కించుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.