ఐపీఎల్ 2022 సీజన్ ఆటగాళ్ల మెగా వేలానికి 1214 మంది ఆటగాళ్లు తమ పేర్లని రిజస్టర్ చేసుకున్నారు. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13న ఈ వేలం జరగనుండగా.. మార్చి చివరి వారంలో ఐపీఎల్ 2022 సీజన్ మ్యాచ్లు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈసారి ఐపీఎల్లోకి కొత్తగా లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంఛైజీలు వస్తున్నాయి. దాంతో.. మొత్తం 10 జట్లతో టోర్నీ జరగనుంది. వేలానికి పేర్లని రిజిస్టర్ చేసుకున్న ఆటగాళ్లలో 896 మంది భారత క్రికెటర్లు ఉండగా.. మిగిలిన 318 మంది విదేశీయులు. అలానే 896 మందిలో ఏకంగా 692 మంది ఆటగాళ్లు ఇంకా ఇంటర్నేషనల్ క్రికెట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక 318 మంది విదేశీయుల్లో 62 మంది ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడలేదు. ఓవరాల్గా ఆస్ట్రేలియా నుంచి 59 మంది ఆటగాళ్లు తమ పేర్లని రిజస్టర్ చేసుకోగా.. దక్షిణాఫ్రికా నుంచి 48 మంది, శ్రీలంక నుంచి 36 మంది, ఇంగ్లాండ్ నుంచి 30 మంది, అఫ్గానిస్థాన్ నుంచి 20 మంది క్రికెటర్లు వేలానికి తమ పేర్లని రిజిస్టర్ చేసుకున్నారు. పాకిస్థాన్ క్రికెటర్లని 2008 నుంచి ఐపీఎల్లోకి బీసీసీఐ అనుమతించని విషయం తెలిసిందే.
ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్కప్ 2022 జరగనుండటంతో.. ఆ టోర్నీకి ప్రెష్గా ఉండేందుకు ఐపీఎల్ 2022కి మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా), జోప్రా ఆర్చర్ (ఇంగ్లాండ్) దూరమయ్యారు. అలానే టెస్టు క్రికెట్పై ఎక్కువ శ్రద్ధ పెట్టేందుకు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్, ఆల్రౌండర్ బెన్స్టోక్స్ కూడా ఈ ఏడాది ఐపీఎల్కి దూరమయ్యారు. ఇక ఐపీఎల్ బయో- సెక్యూర్ బబుల్లో ఉండేందుకు ఇష్టపడని వెస్టిండీస్ సీనియర్ ఓపెనర్ క్రిస్గేల్.. ఐపీఎల్ 2022 వేలానికి తన పేరుని ఇవ్వలేదు.
ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్కప్ 2022 జరగనుండటంతో.. ఆ టోర్నీకి ప్రెష్గా ఉండేందుకు ఐపీఎల్ 2022కి మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా), జోప్రా ఆర్చర్ (ఇంగ్లాండ్) దూరమయ్యారు. అలానే టెస్టు క్రికెట్పై ఎక్కువ శ్రద్ధ పెట్టేందుకు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్, ఆల్రౌండర్ బెన్స్టోక్స్ కూడా ఈ ఏడాది ఐపీఎల్కి దూరమయ్యారు. ఇక ఐపీఎల్ బయో- సెక్యూర్ బబుల్లో ఉండేందుకు ఇష్టపడని వెస్టిండీస్ సీనియర్ ఓపెనర్ క్రిస్గేల్.. ఐపీఎల్ 2022 వేలానికి తన పేరుని ఇవ్వలేదు.