యాప్నగరం

జడేజా స్థానంలో జట్టులోకి అశ్విన్..!

నాగ్‌పూర్ వేదికగా బుధవారం నుంచి జరగనున్న ఇరానీ కప్‌ కోసం భారత సెలక్టర్లు జట్టుని శనివారం ప్రకటించారు. ఇందులో

Samayam Telugu 10 Mar 2018, 2:11 pm
నాగ్‌పూర్ వేదికగా బుధవారం నుంచి జరగనున్న ఇరానీ కప్‌ కోసం భారత సెలక్టర్లు జట్టుని శనివారం ప్రకటించారు. ఇందులో గాయపడిన స్పిన్నర్ రవీంద్ర జడేజా స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకుంటున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు, ఇటీవల రంజీ ట్రోఫీ విజేత విదర్భ జట్టు పోటీపడనున్నాయి.
Samayam Telugu irani cup r ashwin to replace injured ravindra jadeja
జడేజా స్థానంలో జట్టులోకి అశ్విన్..!


రెస్టాఫ్ ఇండియా జట్టులోకి తొలుత జడేజాని తీసుకుందామని సెలక్టర్లు భావించారు. అయితే.. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న అతడ్ని కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో జడేజాని పక్కనపెట్టి అశ్విన్‌కి ఛాన్సిచ్చారు. కరుణ్ నాయర్ ఈ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. అండర్-19 ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన పృథ్వీషా ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. ఏప్రిల్ 7 నుంచి ఐపీఎల్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ టోర్నీ దేశవాళీ క్రికెటర్లకి మంచి ప్రాక్టీస్ అందించనుంది. గత ఏడాది నుంచి భారత వన్డే, టీ20 జట్టుకి అశ్విన్ దూరమైన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.