యాప్నగరం

చెలరేగిన భారత్.. ఐర్లాండ్ టార్గెట్ 214

డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లోనూ భారత బ్యాట్స్‌మెన్ చెలరేగారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ (70: 36 బంతుల్లో 3x4, 6x6), సురేశ్ రైనా

Samayam Telugu 29 Jun 2018, 10:27 pm
డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లోనూ భారత బ్యాట్స్‌మెన్ చెలరేగారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ (70: 36 బంతుల్లో 3x4, 6x6), సురేశ్ రైనా (69: 45 బంతుల్లో 5x4, 3x6), హార్దిక్ పాండ్య (32 నాటౌట్: 9 బంతుల్లో 1x4, 4x6) మెరుపులు మెరిపించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. గత బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 208 పరుగులు చేసిన భారత్.. రెండో టీ20లోనూ 213 రన్స్ చేయడం విశేషం. టీ20ల్లో ఇలా బ్యాక్‌ టు బ్యాక్ 200 మార్క్‌ని భారత్ అందుకోవడం ఇదే తొలిసారి.
Samayam Telugu Dg3wuJLW4AAdAM4


తొలి టీ20లో మెరుపు అర్ధశతకం బాదిన శిఖర్ ధావన్‌కి విశ్రాంతినిచ్చిన భారత్.. కేఎల్ రాహుల్‌కి ఛాన్సిచ్చింది. దీంతో.. అనూహ్యంగా రాహుల్‌తో కలిసి ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లి (9) తక్కువ స్కోరుకే ఔటైనా.. ఐపీఎల్ 2018 సీజన్‌లో అదరగొట్టిన రాహుల్ అదే జోరుని కొనసాగించాడు. అతనికి సురేశ్ రైనా కూడా తోడవడంతో ఐర్లాండ్ బౌలర్ల కష్టాలు రెట్టింపయ్యాయి. భారీ షాట్లు బాదిన ఈ జోడి రెండో వికెట్‌కి అభేద్యంగా 106 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ భారీ స్కోరుకి బాటలు వేసుకుంది.

శతకంవైపు వేగంగా దూసుకెళ్తున్న కేఎల్ రాహుల్ జట్టు స్కోరు 128 వద్ద పేలవ రీతిలో బౌలర్‌కే క్యాచ్ ఇచ్చి ఔటవగా.. అనంతరం సురేశ్ రైనా సిక్స్ కొట్టే ప్రయత్నంలో పెవిలియన్ బాట పట్టాడు. ఓపెనర్ నుంచి మిడిలార్డర్‌లోకి మారిన రోహిత్ శర్మ కూడా డకౌటవడంతో.. భారత్‌ తడబడినట్లు కనిపించింది. కానీ.. ఆఖర్లో మనీశ్ పాండే (21: 20 బంతుల్లో 1x4)తో కలిసి హార్దిక్ పాండ్య ఆకాశమే హద్దుగా చెలరేగి భారత్‌కి భారీ స్కోరు అందించాడు. ఐర్లాండ్ బౌలర్లలో కెవిన్ ఓబ్రైన్ మూడు వికెట్లు పడొట్టాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.