యాప్నగరం

ధోనీపై చలోక్తి విసిరిన జయవర్దనె

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై చలోక్తి విసిరి శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్దనె వార్తల్లో నిలిచాడు.

TNN 8 Aug 2017, 2:05 pm
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై చలోక్తి విసిరి శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్దనె వార్తల్లో నిలిచాడు. ఇటీవల లండన్‌లో ముగిసిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్‌ 100.మీ రేసులో అభిమానుల్ని నిరాశపరుస్తూ రజతంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో బోల్ట్‌కి మద్దతు తెలుపుతూ జయవర్దనె ‘ఉసేన్ బోల్ట్‌ని గౌరవించండి’ అంటూ ట్వీట్ చేశాడు. పదేళ్లకిపైగా కెరీర్‌కి బోల్ట్ ఈ రేసుతో వీడ్కోలు చెప్పేశాడు.
Samayam Telugu is msd faster than bolt mahela jayawardene
ధోనీపై చలోక్తి విసిరిన జయవర్దనె


జయవర్దనె ట్వీట్‌కి స్పందించిన ఓ క్రికెట్ అభిమాని ‘బోల్ట్‌‌ కంటే వేగంగా పరుగెత్తే మహేంద్రసింగ్ ధోనీని కూడా గౌరవించండి’ అంటూ సరదాగా ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన జయవర్దనె ‘ధోనీ తన బైక్‌ మీదా..?’ అంటూ చలోక్తి విసిరాడు. బోల్ట్ వేగాన్ని ధోనీ బైక్‌ మీద వెళ్తే కానీ.. అందుకోలేడని పరోక్షంగా ఈ శ్రీలంక మాజీ క్రికెటర్ వెల్లడించాడు. 2011 ప్రపంచకప్‌ ఫైనల్లో శ్రీలంకపైనే భారత్ గెలిచిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ మ్యాచ్‌‌ని ధోనీ హెలికాప్టర్ షాట్‌‌‌తో ముగించిన తీరు చిరస్మరణీయం.

It was arguably one of the most iconic sporting moment of the decade and everyone was understandably floored. Jayawardene also paid tribute to Bolt after tweeting "Respect @usainbolt" on Twitter.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.