యాప్నగరం

​ ఇషాంత్ పొడవున్నావ్.. బలాల్ని గుర్తించు

దక్షిణాఫ్రికా పర్యటనలో ఇషాంత్ శర్మ తన బలాల్ని గుర్తిస్తే.. టెస్టు సిరీస్‌లో భారత్ మరింత మెరుగైన ప్రదర్శన చేయగలదని మాజీ ఫాస్ట్ బౌలర్

TNN 27 Dec 2017, 1:51 pm
దక్షిణాఫ్రికా పర్యటనలో ఇషాంత్ శర్మ తన బలాల్ని గుర్తిస్తే.. టెస్టు సిరీస్‌లో భారత్ మరింత మెరుగైన ప్రదర్శన చేయగలదని మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. జనవరి 5 నుంచి మూడు టెస్టుల సిరీస్‌ని సఫారీ గడ్డపై భారత్ ఆడనుంది. ఈ నేపథ్యంలో సిరీస్‌ తీరుపై మీడియాతో ప్రసాద్ బుధవారం మాట్లాడారు. ఈ పర్యటన కోసం భారత సెలక్టర్లు ఐదుగురు పేసర్లని జట్టులోకి తీసుకున్నారు. ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ‌లు ఇప్పటికే టెస్టు జట్టులో తమ సత్తా నిరూపించుకోగా.. వన్డే, టీ20ల్లో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరొందిన జస్‌ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేయనున్నాడు.
Samayam Telugu ishant sharma has not realised his potential says venkatesh prasad
​ ఇషాంత్ పొడవున్నావ్.. బలాల్ని గుర్తించు


‘దశాబ్ద కాలంగా ఇషాంత్ శర్మ జట్టులో ఉన్నాడు. ఓ ఫాస్ట్ బౌలర్‌కి ఇది చాలా ఎక్కువ సమయమనే చెప్పాలి. కానీ.. అత్యుత్తమ ప్రదర్శన మాత్రం ఈ పొడగరి ఇవ్వలేకపోతున్నాడు. అతని సమస్య ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఎత్తు ఉన్నాడు.. పిచ్‌ నుంచి పేస్ రాబట్టగలడు.. మైదానంలో దూకుడుగానూ ఉంటాడు. కానీ.. అతను తన బలాల్ని మాత్రం గుర్తించలేకపోతున్నాడు. గతంలో ఇవే అర్హతలున్న జవగల్ శ్రీనాథ్, జహీర్ ఖాన్, కపిల్ దేవ్ జట్టు తరఫున అద్భుతాలు చేశారు. వారి స్థాయి ప్రదర్శన చేసేందుకు ఇషాంత్ ఇకనైనా ప్రయత్నించాలి’ అని వెంకటేశ్ ప్రసాద్ సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.