యాప్నగరం

ఐపీఎల్‌లోకి లంబు మళ్లీ వచ్చేశాడు..!

ఐపీఎల్ వేలంలో రూ.2 కోట్ల ప్రాథమిక ధరతో వేలంలోకి వచ్చిన భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి

TNN 4 Apr 2017, 6:41 pm
ఐపీఎల్ వేలంలో రూ.2 కోట్ల ప్రాథమిక ధరతో వేలంలోకి వచ్చిన భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు. గత ఏడాది రైజింగ్ పుణె సూపర్ జైయింట్స్‌కి ఆడిన ఇషాంత్.. బౌలింగ్‌లో ఆశించిన మేర రాణించలేకపోయాడు. దీంతో ఈ ఏడాది అతణ్ని పుణె యాజమాన్యం వదులుకుంది. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్టు సిరీస్‌లో ఇషాంత్ ఒకవైపు కంగారూల స్లెడ్జింగ్‌కి తనదైన శైలిలో బదులు చెప్తూనే.. బంతితో మెరుగైన గణాంకాలు నమోదు చేశాడు.
Samayam Telugu ishant sharma to replace murali vijay at kxip
ఐపీఎల్‌లోకి లంబు మళ్లీ వచ్చేశాడు..!


వేగంతో పాటు లయను అందుకున్న ఇషాంత్ లాంటి బౌలర్ ఐపీఎల్ టోర్నీలో లేనందుకు అభిమానులు బాధపడ్డారు. కానీ.. తాజాగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఇషాంత్‌ని తమ జట్టులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. గత ఏడాది సీజన్ మధ్యలోంచి పంజాబ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన మురళీ విజయ్ గాయపడి టోర్నీకి దూరమవడంతో ఫ్రాంఛైజీ ప్రస్తుతం ఆందోళన చెందుతోంది. కెప్టెన్‌గా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మాక్స్‌వెల్‌ని ఇప్పటికే నియమించినా.. దేశీయ సీనియర్ ఆటగాళ్లు లేని లోటును పూడ్చాలని పంజాబ్ యాజమాన్యం భావిస్తోంది.

ఈ ప్రణాళికలో భాగంగానే 28 ఏళ్ల ఇషాంత్ శర్మని జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించుకుందట. గత ఏడాది పేలవ ఆటతీరుతో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయిన పంజాబ్ ఈ ఏడాది మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. బుధవారం నుంచి ఐపీఎల్ పదో సీజన్ ఆరంభం కానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.