యాప్నగరం

పంత్ భలేగా సిక్స్‌లు బాదాడు..! : ధావన్

రిషబ్ పంత్ చాలా చక్కగా ఆడాడు. స్పిన్నర్లు, పేసర్లని సమర్థంగా ఎదుర్కొన్న పంత్ కొన్ని చూడచక్కని సిక్సర్లు కూడా బాదాడు. ఎట్టకేలకి సిరీస్‌లో నేను కూడా మంచి స్కోరు సాధించగలిగాను.

Samayam Telugu 12 Nov 2018, 11:06 am
వెస్టిండీస్‌తో చెన్నై వేదికగా ఆదివారం రాత్రి ముగిసిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో యువ హిట్టర్ రిషబ్ పంత్ చాలా బాగా ఆడాడని ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రశంసించాడు. 182 పరుగుల లక్ష్యాన్ని శిఖర్ ధావన్ (92: 62 బంతుల్లో 10x4, 2x6), రిషబ్ పంత్ (58: 38 బంతుల్లో 5x4, 3x6) దూకుడుగా ఆడటంతో భారత్ జట్టు ఆఖరి బంతికి ఛేదించిన విషయం తెలిసిందే. ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ (4), కేఎల్ రాహుల్ (17) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కి చేరిపోయినా.. ధావన్-పంత్ జోడి మూడో వికెట్‌కి అభేద్యంగా 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో టీమిండియా విజయం ఖాయమైంది.
Samayam Telugu 10


మ్యాచ్ అనంతరం శిఖర్ ధావన్ మాట్లాడుతూ ‘రిషబ్ పంత్ చాలా చక్కగా ఆడాడు. స్పిన్నర్లు, పేసర్లని సమర్థంగా ఎదుర్కొన్న పంత్ కొన్ని చూడచక్కని సిక్సర్లు కూడా బాదాడు. ఎట్టకేలకి సిరీస్‌లో నేను కూడా మంచి స్కోరు సాధించగలిగాను. ఛేదన ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు చేజారడంతో.. సీనియర్ బ్యాట్స్‌మెన్‌గా ఆఖరి వరకూ నేను క్రీజులో ఉండాలని నాకు తెలుసు. పంత్‌తో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని బాగా ఆస్వాదించా. ఐదు వన్డేల సిరీస్‌లో 154 పరుగులే చేయడంతో నాపై విమర్శలు గుప్పించారు. కానీ.. వాటిని నేను పట్టించుకోలేదు. మళ్లీ ఫామ్ అందుకున్నందుకు సంతోషంగా ఉంది’ అని శిఖర్ ధావన్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.