యాప్నగరం

MS Dhoniకే 15 ఏళ్లు పట్టింది.. పంత్‌కీ తప్పదు: గంగూలీ

Photo Credit: AP.. భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కీపింగ్ ప్రమాణాల్ని రిషబ్ పంత్ అందుకోవాలంటే కనీసం 15 ఏళ్ల సమయం పడుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాకి ధోనీ పూర్తిగా దూరమైపోగా.. అతని స్థానంలో అవకాశాలు దక్కించుకున్న రిషబ్ పంత్ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్నాడు. దీంతో.. అతనిపై వేటు వేసి.. సంజు శాంసన్ లేదా ఇషాన్ కిషన్‌లకి అవకాశమివ్వాలని డిమాండ్ వినిపిస్తోంది.

Samayam Telugu 6 Dec 2019, 5:29 pm
Photo Credit: AP.. భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కీపింగ్ ప్రమాణాల్ని రిషబ్ పంత్ అందుకోవాలంటే కనీసం 15 ఏళ్ల సమయం పడుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాకి ధోనీ పూర్తిగా దూరమైపోగా.. అతని స్థానంలో అవకాశాలు దక్కించుకున్న రిషబ్ పంత్ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్నాడు. దీంతో.. అతనిపై వేటు వేసి.. సంజు శాంసన్ లేదా ఇషాన్ కిషన్‌లకి అవకాశమివ్వాలని డిమాండ్ వినిపిస్తోంది.
Samayam Telugu it will take rishabh pant 15 years to achieve what ms dhoni has achieved feels bcci president sourav ganguly
MS Dhoniకే 15 ఏళ్లు పట్టింది.. పంత్‌కీ తప్పదు: గంగూలీ


వెస్టిండీస్‌తో టీ20లో రిషబ్ పంత్ ఫెయిలైతే..?

వెస్టిండీస్‌తో శుక్రవారం నుంచి టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడబోతోంది. ఈ సిరీస్‌లో ఒకవేళ రిషబ్ పంత్ ఫెయిలైతే..? అతని కెరీర్‌ ప్రశ్నార్థకంలో పడిపోతుందని వార్తలు వస్తుండగా.. పంత్‌ మళ్లీ లయ అందుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ.. సౌరవ్ గంగూలీ మాత్రం.. తప్పిదాల్ని వేగంగా దిద్దుకుని ముందుకు వెళ్లాలి తప్ప ఇలా కొనసాగిస్తూ వెళ్లకూడదని పరోక్షంగా రిషబ్ పంత్‌కి చురకలేశాడు. ఈ క్రమంలో రిషబ్ పంత్‌ని ధోనీతో పోలుస్తుండటంపైనా గంగూలీ పెదవి విరిచాడు. ముఖ్యంగా.. రిషబ్ పంత్ మైదానంలో తప్పిదాలు చేసిన ప్రతిసారీ.. స్టేడియంలోని ప్రేక్షకులు బిగ్గరగా ధోనీ పేరుని పిలవడంపై గంగూలీ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ధోనీకే టైమ్ తప్పలేదు.. పంత్‌ ఎంత..?

‘కెరీర్ ఆరంభంలోనే ధోనీ ఈ స్థాయికి చేరుకోలేదు. బెస్ట్‌గా నిరూపించుకునేందుకు అతనికి 15 ఏళ్లు టైమ్ పట్టింది. ఇప్పుడు ధోనీ దరిదాపుల్లోకి రావాలన్నా రిషబ్ పంత్‌కి కూడా కనీసం 15 ఏళ్లు సమయం పడుతుంది. పంత్‌ సామర్థ్యంపై మాకు నమ్మకం ఉంది. కానీ.. టీమ్‌లోని మిగిలిన ఆటగాళ్లు కూడా అతనికి మద్దతుగా నిలవాలి. ఇక రిషబ్ పంత్ తప్పులు చేసిన ప్రతిసారి ధోనీ పేరుని ప్రేక్షకులు బిగ్గరగా అరవడం సమంజసం కాదు. ఎందుకంటే.. ధోనీ, రిషబ్ పంత్ వేర్వేరు జనరేషన్ ఆటగాళ్లు’ అని గంగూలీ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.