యాప్నగరం

​ మూడో టెస్టుకి జడేజా సస్పెండ్..!

శ్రీలంక బ్యాట్స్‌మెన్‌కి హాని కలిగించే రీతిలో బంతిని విసిరినందుకు అతనిపై మ్యాచ్ రిఫరీ క్రమశిక్షణ చర్యల కింద

TNN 6 Aug 2017, 8:10 pm
శ్రీలంకతో కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆల్‌రౌండర్ ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన భారత స్పిన్నర్ రవీంద్ర జడేజాపై ఒక టెస్టు మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడింది. ఫీల్డింగ్ సమయంలో శ్రీలంక బ్యాట్స్‌మెన్‌కి హాని కలిగించే రీతిలో బంతిని విసిరినందుకు అతనిపై మ్యాచ్ రిఫరీ క్రమశిక్షణ చర్యల కింద మూడు డీమెరిట్ పాయింట్లు ఇచ్చాడు.
Samayam Telugu jadeja suspended for third test against sri lanka
​ మూడో టెస్టుకి జడేజా సస్పెండ్..!


ఇప్పటికే మూడు డీమెరిట్ పాయింట్లతో ఉన్న జడేజా ఖాతాలో ఈ పాయింట్లు చేరడంతో అతడు ఒక టెస్టు మ్యాచ్‌ నిషేధానికి గురయ్యాడు. దీంతో ఆగస్టు 12 నుంచి శ్రీలంకతో జరగనున్న మూడో టెస్టుకి జడేజా దూరం కానున్నాడు. ఆటలో మూడోరోజైన శనివారం బంతిని అందుకున్న జడేజా.. బ్యాట్స్‌మెన్ కరుణరత్నెని గాయపరిచే రీతిలో బంతిని ప్రమాదకరంగా విసిరి తప్పు చేశాడు. గత ఏడాది న్యూజిలాండ్‌తో టెస్టు మ్యాచ్ సందర్భంగా పిచ్‌పై నడిచిన జడేజా ఖాతాలో మ్యాచ్ రిఫరీ మూడు డీమెరిట్ పాయింట్లు ఇచ్చాడు.

India all-rounder Ravindra Jadeja was handed a one-match suspension after he was found guilty of breaching article 2.2.8 of the player's code of conduct which deals with "throwing a ball (or any other item of cricket equipment such as a water bottle) at or near a Player, Player Support Personnel, Umpire, Match Referee or any other third person in an inappropriate and/or dangerous manner during an International Match".

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.