భారత సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)ని తక్కువ అంచనా వేసిన హాంకాంగ్ కెప్టెన్ నిజాఖత్ ఖాన్ (Nizakat Khan) మూల్యం చెల్లించుకున్నాడు. భారత్, హాంకాంగ్ మధ్య (India vs Hong Kong) బుధవారం రాత్రి ఆసియా కప్ 2022 (Asia Cup 2022) మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 2 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన హాంకాంగ్ టీమ్ ఆరంభంలోనే వరుసగా ఓపెనర్ల వికెట్లని చేజార్చుకుంది. ఓపెనర్ యాసిమ్ (9: 9 బంతుల్లో 2x4)ని ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ బౌన్సర్తో బోల్తా కొట్టించగా.. మరో ఓపెనర్గా ఆడిన కెప్టెన్ నిజాఖత్ ఖాన్ (10: 12 బంతుల్లో 1x4) జడేజాని తక్కువ అంచనా వేసి రనౌట్గా వెనుదిరిగాడు. వాస్తవానికి రవీంద్ర జడేజా మంచి ఫీల్డర్. మైదానంలోని ఏ ప్రదేశంలోనైనా అతను అత్యుత్తమంగా ఫీల్డింగ్ చేయగలడు. క్లిష్టమైన క్యాచ్లను పట్టడమే కాదు.. వికెట్లపైకి మెరుగు వేగంతో బంతిని నేరుగా విసరగలడు. క్రికెట్ ప్రపంచం మొత్తానికీ ఈ విషయం తెలుసు. కానీ.. నిజాఖత్ ఖాన్ ఆ విషయం మరిచిపోయినట్లున్నాడు.
ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన అర్షదీస్ సింగ్ బౌలింగ్లో బంతిని బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఫుష్ చేసిన నిజాఖత్ ఖాన్.. సింగిల్ కోసం నాన్స్ట్రైక్ ఎండ్లోని బాబర్ హయాత్ని పిలిచాడు. దానికి తొలుత స్పందించిన బాబర్ హయాత్.. ఆ తర్వాత బంతి నేరుగా జడేజా చేతుల్లోకి వెళ్లడంతో వెనక్కి తగ్గి.. నిజాఖత్ ఖాన్ని కూడా వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా సూచించాడు. కానీ.. అప్పటికే పిచ్ మధ్యలోకి వెళ్లిన నిజాఖత్ ఖాన్ ఆగిపోయి మళ్లీ వెనక్కి రాబోయాడు.
కానీ.. వేగంగా మాత్రం అతను వెనక్కి వచ్చే ప్రయత్నం చేయలేదు. ఇదే అతని తప్పిదమైంది. బంతిని అందుకున్న జడేజా దాదాపు 23 మీటర్ల దూరం నుంచి గంటకి 104కిమీ వేగంతో బంతిని నేరుగా వికెట్లపైకి విసిరాడు. దాంతో.. బంతి వికెట్లని తాకే సమయానికి క్రీజు సమీపానికి మాత్రమే బ్యాట్ని నిజాఖత్ ఖాన్ తీసుకురాగలిగాడు. బంతి వికెట్లని తాకిన తీరుని చూసి నిజాఖత్ ఖాన్ నోరెళ్లబెట్టేశాడు. జడేజా త్రో చూసిన కోహ్లీ.. గోలీ వేసినట్లు త్రో చేశావ్ అంటూ నవ్వుతూ సిగ్నల్ ఇచ్చాడు. మ్యాచ్లో ఆఖరికి భారత్ 40 పరుగులు తేడాతో గెలిచింది.
ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన అర్షదీస్ సింగ్ బౌలింగ్లో బంతిని బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఫుష్ చేసిన నిజాఖత్ ఖాన్.. సింగిల్ కోసం నాన్స్ట్రైక్ ఎండ్లోని బాబర్ హయాత్ని పిలిచాడు. దానికి తొలుత స్పందించిన బాబర్ హయాత్.. ఆ తర్వాత బంతి నేరుగా జడేజా చేతుల్లోకి వెళ్లడంతో వెనక్కి తగ్గి.. నిజాఖత్ ఖాన్ని కూడా వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా సూచించాడు. కానీ.. అప్పటికే పిచ్ మధ్యలోకి వెళ్లిన నిజాఖత్ ఖాన్ ఆగిపోయి మళ్లీ వెనక్కి రాబోయాడు.
కానీ.. వేగంగా మాత్రం అతను వెనక్కి వచ్చే ప్రయత్నం చేయలేదు. ఇదే అతని తప్పిదమైంది. బంతిని అందుకున్న జడేజా దాదాపు 23 మీటర్ల దూరం నుంచి గంటకి 104కిమీ వేగంతో బంతిని నేరుగా వికెట్లపైకి విసిరాడు. దాంతో.. బంతి వికెట్లని తాకే సమయానికి క్రీజు సమీపానికి మాత్రమే బ్యాట్ని నిజాఖత్ ఖాన్ తీసుకురాగలిగాడు. బంతి వికెట్లని తాకిన తీరుని చూసి నిజాఖత్ ఖాన్ నోరెళ్లబెట్టేశాడు. జడేజా త్రో చూసిన కోహ్లీ.. గోలీ వేసినట్లు త్రో చేశావ్ అంటూ నవ్వుతూ సిగ్నల్ ఇచ్చాడు. మ్యాచ్లో ఆఖరికి భారత్ 40 పరుగులు తేడాతో గెలిచింది.