యాప్నగరం

దక్షిణాఫ్రికాతో వన్డేలకి భారత్ జట్టు ఎంపిక

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ కోసం భారత సెలక్టర్లు జట్టుని శనివారం రాత్రి ప్రకటించారు. జనవరి 5 నుంచి సఫారీలతో మూడు టెస్టుల సిరీస్‌లో

TNN 23 Dec 2017, 8:49 pm
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ కోసం భారత సెలక్టర్లు జట్టుని శనివారం రాత్రి ప్రకటించారు. జనవరి 5 నుంచి సఫారీలతో మూడు టెస్టుల సిరీస్‌లో తలపడనున్న టీమిండియా.. అనంతరం ఫిబ్రవరి 1 నుంచి ఆరు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇప్పటికే టెస్టుల్లో పోటీపడే జట్టుని ప్రకటించిన సెలక్టర్లు.. తాజాగా వన్డే సిరీస్ కోసం 17 మందితో కూడిన జట్టుని ఎంపిక చేశారు.
Samayam Telugu jadhav thakur return to india squad for sa odis umesh rahul miss out
దక్షిణాఫ్రికాతో వన్డేలకి భారత్ జట్టు ఎంపిక


తొడకండరాల గాయం కారణంగా శ్రీలంకతో వన్డే సిరీస్‌కి దూరమైన కేదార్ జాదవ్ మళ్లీ జట్టులో చోటు సంపాదించగా.. ముంబయి పేసర్ శార్ధూల్ ఠాకూర్‌‌పై కూడా సెలక్టర్లు నమ్మకం ఉంచారు. దీంతో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్, సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్‌పై వేటు పడింది. ఇటీవల యో-యో టెస్టులో పాసైన సురేశ్ రైనా, యువరాజ్ సింగ్‌కి మరోసారి సెలక్టర్లు మొండిచేయి చూపారు.

వన్డే జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అజింక్య రహానె, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, ధోని, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, శార్ధూల్ ఠాకూర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.