యాప్నగరం

Jasprit Bumrah: T20 వరల్డ్ కప్ ముందు టీమిండియాకు షాక్.. బుమ్రా ఔట్‌

T20 World Cup 2022 ముందు భారత అభిమానులకు షాకింగ్ వార్త. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఈ టోర్నీ నుంచి ఔటయ్యాడు. గాయంతో బుమ్రా టీ20 వరల్డ్ కప్‌కు దూరమయ్యాడని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. బుమ్రా కోలుకునేందుకు 6 నెలల సమయం పట్టే అవకాశం ఉందని సదరు అధికారి చెప్పినట్లు పీటీఐ పేర్కొంది. మరో ఆటగాడు రవీంద్ర జడేజా గాయంతో ఇప్పటికే ఈ టోర్నీకి దూరమయ్యాడు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 30 Sep 2022, 11:55 am

ప్రధానాంశాలు:

  • టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత అభిమానులకు చేదు వార్త.
  • ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ టోర్నీకి దూరమయ్యాడు.
  • బుమ్రా కోలుకునేందుకు 6 నెలల సమయం పట్టవచ్చని బీసీసీఐ ప్రతినిధి తెలిపారు.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Jasprit Bumrah ruled out of T20 World Cup
జస్‌ప్రీత్ బుమ్రా
T20 ప్రపంచకప్‌‌కు ముందు భారత అభిమానులకు షాకింగ్ న్యూస్. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఈ టోర్నీ నుంచి ఔటయ్యాడు. గాయంతో బుమ్రా టీ20 వరల్డ్ కప్‌కు దూరమయ్యాడని బీసీసీఐ ప్రతినిధి తెలిపినట్లు పీటీఐ పేర్కొంది. బుమ్రా కోలుకునేందుకు 6 నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సదరు అధికారి చెప్పినట్లు రాసింది. మరో సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజా కూడా గాయంతో ఈ టోర్నీకి దూరమయ్యాడు. తాజాగా బుమ్రా కూడా దూరమవడం జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా.. దక్షిణాఫ్రికాతో తిరువనంతపురం వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతోనూ తొలి టీ20 మ్యాచ్ ఆడలేదు. అయితే, దక్షిణాఫ్రికాతో సిరీస్‌లోని మిగతా మ్యాచ్‌లకు, టీ20 ప్రపంచకప్‌కూ బుమ్రా అందుబాటులో వస్తాడని అభిమానులు భావించారు. అయితే, బుమ్రా ఇప్పట్లో జట్టుతో కలిసే అవకాశం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది.
బుమ్రా స్థానంలో జట్టులోకి హైదరాబాద్ పేసర్
కొంత కాలంగా గాయంతో బాధపడుతున్న బుమ్రా.. విశ్రాంతి తీసుకొని చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చాడు. ఆసీస్‌తో టీ20 సిరీస్‌‌లో రెండు మ్యాచ్‌లు ఆడాడు. సఫారీలతో తొలి మ్యాచ్‌‌కు దూరమయ్యాడు. అయితే, టీ20 ప్రపంచకప్ వరకు బుమ్రా కోలుకుంటాడని.. పేస్‌కు సహకరించే ఆసీస్‌ పిచ్‌లపై చెలరేగుతాడని ఫ్యాన్స్ భావించారు. ఈ నేపథ్యంలో అభిమానులకు ఇది చేదు వార్తే. బుమ్రా స్థానంలో హైదరాబాద్ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ను జట్టులోకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ శుక్రవారం (సెప్టెంబర్ 30) వెల్లడించింది.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.