యాప్నగరం

బౌలర్ జులన్ గోస్వామి అరుదైన రికార్డు

భారత మహిళల జట్టు ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామి వన్డేల్లో 200 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా బుధవారం రికార్డు

TNN 7 Feb 2018, 7:11 pm
భారత మహిళల జట్టు ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామి వన్డేల్లో 200 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా బుధవారం రికార్డు నెలకొల్పింది. ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్‌ తొలి రౌండ్‌ పోరులో భాగంగా దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ని భారత్ ఆడుతోంది. ఇందులో భాగంగా బుధవారం జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా ఓపెనర్ లూరా (9) వికెట్‌ని పడగొట్టిన జులన్ గోస్వామి కెరీర్‌లో 200 వికెట్ల మైలురాయిని అందుకుంది.
Samayam Telugu jhulan goswami first to take 200 women odi wickets
బౌలర్ జులన్ గోస్వామి అరుదైన రికార్డు


ఈ సిరీస్ ఆరంభానికి ముందు.. 195 వికెట్లతో ఉన్న జులన్.. తొలి వన్డేలో 4 వికెట్లు పడగొట్టగా.. తాజాగా రెండో వన్డేలో ఒక వికెట్ తీయడం ద్వారా ఈ అరుదైన క్లబ్‌లో చేరింది. ఇప్పటికే బ్యాట్‌తో 1,000 పరుగులు, బంతితో 150 వికెట్లు తీసిన ఏకైక మహిళా క్రికెటర్‌గా జులన్ ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.