భారత మహిళల జట్టు సీనియర్ ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామి టీ20 క్రికెట్కి వీడ్కోలు పలికింది. సుదీర్ఘకాలంగా వన్డే, టీ20ల్లో నమ్మదగిన బౌలర్గా గుర్తింపు పొందిన జులన్.. బ్యాట్తోనూ మెరుస్తూ వచ్చింది. అయితే.. వన్డేలపై పూర్తి శ్రద్ధ పెట్టేందుకు టీ20ల నుంచి ఆమె వైదొలగినట్లు తెలుస్తోంది. 2006లో టీ20ల్లోకి అరంగేట్రం చేసిన ఈ ఫాస్ట్ బౌలర్ ఈరోజు ఆ ఫార్మాట్కి వీడ్కోలు పలికినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే భారత్ జట్టు టీ20 ప్రపంచకప్ ఆడాల్సి ఉండగా.. జులన్ రిటైర్మెంట్ జట్టుకి గట్టి ఎదురుదెబ్బ.
టీ20ల్లోకి 12 ఏళ్ల క్రితం అరంగేట్రం చేసిన జులన్ గోస్వామి కెరీర్లో మొత్తం 68 టీ20 మ్యాచ్లాడింది. ఆసియా కప్లో భాగంగా కౌలాలంపూర్లో బంగ్లాదేశ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్తో ఆఖరి టీ20 మ్యాచ్ ఆడిన ఈ ఫాస్ట్ బౌలర్.. ఆ మ్యాచ్లో రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 20 పరుగులిచ్చింది. అయితే ఆ మ్యాచ్లో కనీసం ఒక వికెట్ కూడా పడగొట్టలేకపోయింది.
టీ20లతో పోలిస్తే వన్డేల్లో జులన్ గోస్వామి రికార్డ్ మెరుగ్గా ఉంది. కెరీర్లో ఇప్పటికే 169 వన్డేలాడిన జులన్.. మొత్తం 203 వికెట్లు పడగొట్టింది. రమేశ్ పొవార్ జట్టు కోచ్గా ఎంపికైన వారం వ్యవధిలోనే ఈ సీనియర్ బౌలర్ రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం.
టీ20ల్లోకి 12 ఏళ్ల క్రితం అరంగేట్రం చేసిన జులన్ గోస్వామి కెరీర్లో మొత్తం 68 టీ20 మ్యాచ్లాడింది. ఆసియా కప్లో భాగంగా కౌలాలంపూర్లో బంగ్లాదేశ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్తో ఆఖరి టీ20 మ్యాచ్ ఆడిన ఈ ఫాస్ట్ బౌలర్.. ఆ మ్యాచ్లో రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 20 పరుగులిచ్చింది. అయితే ఆ మ్యాచ్లో కనీసం ఒక వికెట్ కూడా పడగొట్టలేకపోయింది.
టీ20లతో పోలిస్తే వన్డేల్లో జులన్ గోస్వామి రికార్డ్ మెరుగ్గా ఉంది. కెరీర్లో ఇప్పటికే 169 వన్డేలాడిన జులన్.. మొత్తం 203 వికెట్లు పడగొట్టింది. రమేశ్ పొవార్ జట్టు కోచ్గా ఎంపికైన వారం వ్యవధిలోనే ఈ సీనియర్ బౌలర్ రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం.