యాప్నగరం

​ గాయంతో టీ20 సిరీస్‌కి జులన్ దూరం..!

దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో మంగళవారం నుంచి జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కి గాయం కారణంగా భారత మహిళల

TNN 13 Feb 2018, 2:07 pm
దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో మంగళవారం నుంచి జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కి గాయం కారణంగా భారత మహిళల జట్టు ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామి దూరమైంది. ఇటీవల ముగిసిన మూడు వన్డేల సిరీస్‌ని 2-1తో దక్కించుకున్న భారత జట్టు.. టీ20 సిరీస్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేయాలని ఆశిస్తోంది. అయితే.. మహిళల క్రికెట్ వన్డే చరిత్రలోనే 200 వికెట్లు పడగొట్టిన ఏకైక క్రికెటర్‌గా గత వారం రికార్డు నెలకొల్పి.. మంచి ఫామ్‌లో ఉన్న జులన్ జట్టుకి దూరమవడం భారత్‌కి తీరనిలోటుగా చెప్పవచ్చు.
Samayam Telugu jhulan ruled out of t20i series against south africa
​ గాయంతో టీ20 సిరీస్‌కి జులన్ దూరం..!


‘ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామి మడమకి గాయమైంది. దక్షిణాఫ్రికాలోనే స్థానిక వైద్యులకి చూపించగా.. కనీసం రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో జులన్‌ని బెంగళూరు‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీకి పంపించి.. చికిత్స చేయించాలని నిర్ణయించాం’ అని బీసీసీఐ మంగళవారం వెల్లడించింది. ఈ టీ20 సిరీస్‌లో భారత జట్టుకి హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. మంగళవారం తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.