IND vs NZ: కాన్పూర్ టెస్టులో విజయానికి 9 వికెట్ల దూరంలో భారత్
కాన్పూర్ టెస్టులో నాలుగో రోజు శ్రేయాస్ అయ్యర్, సాహా భారత్ పరువు నిలపగా.. అశ్విన్ చివర్లో వికెట్ పడగొట్టి న్యూజిలాండ్పై ఒత్తిడి పెంచేశాడు. టీమిండియా విజయానికి..
Samayam Telugu 28 Nov 2021, 9:30 pm
ప్రధానాంశాలు:
- కాన్పూర్ టెస్టులో పట్టు బిగించిన భారత్
- న్యూజిలాండ్కి 284 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన టీమిండియా
- హాఫ్ సెంచరీలు బాదిన శ్రేయాస్ అయ్యర్, సాహా
- ఛేదన ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన కివీస్
న్యూజిలాండ్తో జరుగుతున్న కాన్పూర్ టెస్టులో విజయానికి భారత్ జట్టు 9 వికెట్ల దూరంలో ఉంది. మ్యాచ్లో నాలుగో రోజైన ఆదివారం ఓవర్నైట్ స్కోరు 14/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా 234/7తో ఇన్నింగ్స్ని డిక్లేర్ చేసింది. దాంతో.. తొలి ఇన్నింగ్స్ 49 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని మొత్తం.. 284 లక్ష్యాన్ని న్యూజిలాండ్కి భారత్ నిర్దేశించింది. చివరి సెషన్లో ఛేదనకు దిగిన కివీస్ ఈరోజు ఆట ముగిసే సమయానికి 4/1తో నిలవగా.. ఆ జట్టు విజయానికి ఇంకా 280 పరుగులు చేయాల్సి ఉంది. వాస్తవానికి ఈరోజు తొలి సెషన్లో భారత్ ఆడిన తీరు చూస్తే.. 200+ స్కోరు చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (17), చతేశ్వర్ పుజారా (22)తో పాటు కెప్టెన్ అజింక్య రహానె (4), రవీంద్ర జడేజా (0) తక్కువ స్కోరుకే ఔటైపోయారు. కానీ.. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ నమోదు చేసిన శ్రేయాస్ అయ్యర్.. ఈరోజు రెండో ఇన్నింగ్స్లోనూ 125 బంతుల్లో 8x4, 1x6 సాయంతో 65 పరుగులు చేయగా.. అతనికి అశ్విన్ (32: 62 బంతుల్లో 5x4) సహకారం అందించాడు. అలానే సాహా (61 నాటౌట్: 126 బంతుల్లో 4x4, 1x6) కూడా చాలా రోజుల తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడటంతో.. భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. అయితే.. చివరి సెషన్ మరికాసేపట్లో ముగుస్తుందన్న దశలో భారత్ ఇన్నింగ్స్ని 234/7తో రహానె డిక్లేర్ చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, జెమీషన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. అజాజ్ పటేల్కి ఒక వికెట్ దక్కింది.
284 పరుగుల ఛేదనని ప్రారంభించిన న్యూజిలాండ్.. మూడో ఓవర్లోనే ఓపెనర్ విల్ యంగ్ (2: 6 బంతుల్లో) వికెట్ చేజార్చుకుంది. అశ్విన్ విసిరిన బంతిని అర్థం చేసుకోలేకపోయిన విల్ యంగ్ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో టామ్ లాథమ్ (2 బ్యాటింగ్: 13 బంతుల్లో), విలియమ్ సోమర్విల్లే (0 బ్యాటింగ్: 5 బంతుల్లో) ఉన్నారు. మ్యాచ్లో సోమవారం చివరి రోజుకాగా.. బ్యాటింగ్కి కష్టంగా మారుతున్న పిచ్పై న్యూజిలాండ్ 280 పరుగులు చేయడం కష్టమే!
284 పరుగుల ఛేదనని ప్రారంభించిన న్యూజిలాండ్.. మూడో ఓవర్లోనే ఓపెనర్ విల్ యంగ్ (2: 6 బంతుల్లో) వికెట్ చేజార్చుకుంది. అశ్విన్ విసిరిన బంతిని అర్థం చేసుకోలేకపోయిన విల్ యంగ్ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో టామ్ లాథమ్ (2 బ్యాటింగ్: 13 బంతుల్లో), విలియమ్ సోమర్విల్లే (0 బ్యాటింగ్: 5 బంతుల్లో) ఉన్నారు. మ్యాచ్లో సోమవారం చివరి రోజుకాగా.. బ్యాటింగ్కి కష్టంగా మారుతున్న పిచ్పై న్యూజిలాండ్ 280 పరుగులు చేయడం కష్టమే!