యాప్నగరం

7 ఏళ్ల నిషేధం.. రీఎంట్రీ మ్యాచ్‌లోనే స్లెడ్జింగ్‌కి దిగిన ఎస్. శ్రీశాంత్

భారత్ జట్టుకి ఆడే రోజుల్లో బ్యాట్స్‌మెన్‌పై కవ్వింపులకి దిగేందుకు ఎస్. శ్రీశాంత్ ఏమాత్రం వెనుకంజ వేసేవాడు కాదు. తాజాగా ఏడేళ్ల నిషేధం తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చినా.. అతని ప్రవర్తనలో ఇసుమంత కూడా మార్పు లేదు. ఐపీఎల్‌లో తన దూకుడు కారణంగా హర్భజన్ సింగ్‌తో చెంపదెబ్బ కూడా ఈ పేసర్ తిన్నాడు.

Samayam Telugu 1 Jan 2021, 10:14 am
భారత వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఎస్. శ్రీశాంత్ ఏడేళ్ల నిషేధం తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. జనవరి 10 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ జరగనుండగా.. కేరళ టీమ్‌లోకి ఎంపికైన ఈ పేసర్ తాజాగా ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. అయితే.. రీఎంట్రీ మ్యాచ్‌లోనే కేరళ టీమ్‌లోని సహచర బ్యాట్స్‌మెన్‌పై అతను స్లెడ్జింగ్‌కి దిగడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
Samayam Telugu S Sreesanth (Photo: Screen grab)


2013 ఐపీఎల్‌లో స్ఫాట్‌ ఫిక్సింగ్‌కి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఎస్. శ్రీశాంత్‌పై అప్పట్లో బీసీసీఐ జీవితకాలం నిషేధం విధించింది. అయితే.. ఆ నిషేధాన్ని ఏడేళ్లకి మళ్లీ బీసీసీఐ కుదించగా.. గత ఏడాది సెప్టెంబరుతో అది ముగిసింది. దాంతో.. కేరళ తరఫున మళ్లీ దేశవాళీ క్రికెట్‌లో ఆడేందుకు అతనికి మార్గం సుగుమమైంది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో 37 ఏళ్ల శ్రీశాంత్ సత్తాచాటితే ఐపీఎల్ 2020లోనూ అతను ఆడే అవకాశం ఉంది.


2013 తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టినప్పటికీ శ్రీశాంత్.. మునుపటి తరహాలోనే బంతులు సంధిస్తూ కనిపించాడు. బౌలింగ్ యాక్షన్ కొద్దిగా మారినప్పటికీ.. వేగంగానే అతను లయ అందుకుని వికెట్లు కూడా పడగొట్టాడు. దాంతో.. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో శ్రీశాంత్ ఆడటం లాంఛనమే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.