యాప్నగరం

రికార్డులు బ్రేక్ చేసిన రాహుల్-పంత్ జోడీ

ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టెస్టులో అద్భుత బ్యాటింగ్‌తో శతకాలు సాధించిన రాహుల్, పంత్‌లు.. అనేక రికార్డులను నెలకొల్పారు. కానీ కొద్ది తేడాలో అరుదైన రికార్డులను కోల్పోయారు.

Samayam Telugu 12 Sep 2018, 10:03 am
ఇంగ్లాండ్ పర్యటనను భారత్ ఓటమితో ముగించింది. ఐదు టెస్టుల సిరీస్‌ను 4-1 తేడాతో కోల్పోయింది. కానీ చివరి టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ పోరాటం ఆకట్టుకుంది. ముఖ్యంగా ఓపెనర్ కేఎల్ రాహుల్ (149), రిషబ్ పంత్ (114) అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్‌ను వణికించారు. ఓవర్‌నైట్ స్కోరు 58/3తో చివరి రోజు ఆట ప్రారంభించిన భారత్‌ను రాహుల్, పంత్ శతకాలతో ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 204 పరుగులు జోడించి భారత శిబిరంలో ఆశలు రేపారు. కానీ అద్భుత బంతితో రాహుల్‌ను రషీద్ పెవిలియన్ చేర్చడం, తర్వాత పంత్ కూడా ఔటవడంతో భారత్ ఓటమి ఖాయమైంది.
Samayam Telugu pant rahul


ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికీ.. రాహుల్, పంత్ అనేక రికార్డులు నెలకొల్పారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 204 రన్స్ జోడించగా.. నాలుగో ఇన్నింగ్స్‌లో భారత్ తరఫున ఏ వికెట్‌కైనా ఇదే రెండో అతిపెద్ద భాగస్వామ్యం. 1979లో సునీల్ గావస్కర్ - చౌహాన్ ఓవల్‌లోనే తొలి వికెట్‌కు 213 పరుగులు జోడించారు.

నాలుగో ఇన్నింగ్స్‌లో ఏ జట్టు తరఫునైనా ఆరో వికెట్‌కు నమోదైన రెండో అత్యధిక భాగస్వామ్యం రాహుల్-పంత్ జోడీది. 1999లో లాంగర్-గిల్‌క్ట్రిస్ట్ జోడి పాకిస్థాన్‌పై ఆరో వికెట్‌కు 238 పరుగులు జోడించింది.

నాలుగో ఇన్నింగ్స్‌లో ఇద్దరు భారత్ బ్యాట్స్‌మెన్ సెంచరీ సాధించడం ఇది నాలుగోసారి. చివరసారిగా రాహుల్ ద్రవిడ్, సౌరభ్ గంగూలీలు 1999లో న్యూజిలాండ్‌పై శతకాలు బాదారు.

ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 149 పరుగులు చేశాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన రెండో భారత బ్యాట్స్‌మెన్ అతడే కావడం విశేషం. 1979 ఓవల్ మ్యాచ్‌లో గావస్కర్ 221 పరుగులు చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.