యాప్నగరం

విరాట్ కోహ్లీని కెలికావ్ కదా..? జీవితంలో టీమిండియాకి ఆడలేవ్ పో: నెటిజన్లు శాపాలు

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య గొడవలో సూర్యకుమార్ యాదవ్ అనవసరంగా వేలు పెట్టాడా..? తప్పిదాన్ని దిద్దుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక జీవితంలో టీమిండియాకి ఆడలేవంటున్న నెటిజన్లు

Samayam Telugu 17 Nov 2020, 9:31 am
ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ వివాదంలో చిక్కుకున్నాడు. విరాట్ కోహ్లీని పేపర్ కెప్టెన్‌గా అభివర్ణిస్తూ.. భారత సెలెక్టర్‌పై ఓ నెటిజన్ పెట్టిన విమర్శనాత్మక ట్వీట్‌కి సూర్యకుమార్ యాదవ్ లైక్ కొట్టడమే ఇప్పుడు పెద్ద తప్పిదమైపోయింది. ఆ ట్వీట్‌లో రోహిత్ శర్మని హీరోగా చిత్రీకరించడం‌తో సూర్యకుమార్ యాదవ్ తొందరపడినట్లు తెలుస్తోంది. పొరపాటుని గ్రహించి దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆ లైక్‌ని సూర్యకుమార్ తొలగించినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
Samayam Telugu Virat Kohli and Rohit Sharma rift (Image Source: Twitter)



వాస్తవానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య గత ఏడాదికాలంగా ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. తరచూ రోహిత్ శర్మ అవకాశాలకి కెప్టెన్‌గా కోహ్లీ అడ్డు తగులుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాంతో నెటిజన్లు కూడా రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ టైమ్‌లో ఆ వివాదంలోకి వేలు పెట్టిన సూర్యకుమార్ యాదవ్.. తన కెరీర్‌ని ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.


ఐపీఎల్ 2020 సీజన్‌లో 16 మ్యాచ్‌లాడిన సూర్యకుమార్ యాదవ్ 480 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉండగా.. కొన్ని గెలిపించే ఇన్నింగ్స్‌లు ఉన్నాయి. దాంతో ఆస్ట్రేలియా పర్యటనకి అతడ్ని ఎంపిక చేస్తారని అంతా ఊహించారు. కానీ.. ఛాన్స్ దక్కలేదు. దాంతో అతను టీమిండియాకి ఎంపికవ్వాలంటే ఇంకా ఏం చేయాలి..? అంటూ హర్భజన్ సింగ్ లాంటి సీనియర్ క్రికెటర్లు ప్రశ్నించారు. కానీ.. కెప్టెన్ కోహ్లీని కెలికిన సూర్యకుమార్ యాదవ్ ఇక ఎప్పటికీ టీమిండియాకి ఆడలేడంటూ నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.