యాప్నగరం

మ్యాచ్ ఓటమితో.. విరాట్ కోహ్లి ఒంటరిగా

‘ప్రతిరోజు అవకాశాల్ని ఒడిసి పట్టుకుంటూ.. ముందుకు సాగిపోవాలి’

TNN 27 Feb 2017, 2:51 pm
భారత్ జైత్రయాత్రకు ఆస్ట్రేలియా ఘోరమైన రీతిలో బ్రేక్‌ వేయడంతో ప్రస్తుతం కెప్టెన్ విరాట్ కోహ్లి సమాలోచనలో పడినట్లున్నాడు. పుణె వేదికగా ఆదివారం ముగిసిన తొలి టెస్టులో భారత్ 333 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. గత నాలుగు టెస్టు సిరీస్‌ల్లోనూ భారీ స్కోర్లతో విరుచుకుపడిన విరాట్ కోహ్లి ఈ టెస్టులోని రెండు ఇన్నింగ్స్‌లో (0, 13) నిరాశపరిచాడు. అతనితో పాటు టాప్ ఆర్డర్‌లోని బ్యాట్స్‌మెన్లు సైతం నిరాశపరచడంతో భారత్ జట్టు ఆస్ట్రేలియాకి కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది.
Samayam Telugu kohli everyday is a blessing and an opportunity
మ్యాచ్ ఓటమితో.. విరాట్ కోహ్లి ఒంటరిగా


తాజాగా భారత్ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు పర్వత ప్రాంతాలను వీక్షిస్తూ ఒత్తిడి తగ్గించుకునే పనిలో పడ్డారు. ఈ సందర్భంగా తాను ఒంటరిగా కూర్చుని తీక్షణంగా ఆలోచిస్తున్న ఓ ఫొటోను అభిమానులతో విరాట్ కోహ్లి పంచుకున్నాడు. ‘ప్రతిరోజు అవకాశాల్ని ఒడిసి పట్టుకుంటూ.. ముందుకు సాగిపోవాలి’ అంటూ చెప్పుకొచ్చాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ బెంగళూరు వేదికగా మార్చి 4 నుంచి ప్రారంభంకానుంది. తప్పిదాలను దిద్దుకుని రెండో టెస్టులో సత్తా చాటాలని భారత్ ఉవ్విళ్లరుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.