యాప్నగరం

చివరి టీ20లో కోహ్లి చేతికి టెస్టు ‘గద’

దక్షిణాఫ్రికాతో శనివారం రాత్రి జరగనున్న మూడో టీ20 మ్యాచ్ ముగియగానే భారత కెప్టెన్ విరాట్ కోహ్లి చేతికి టెస్టు గద

TNN 24 Feb 2018, 4:42 pm
దక్షిణాఫ్రికాతో శనివారం రాత్రి జరగనున్న మూడో టీ20 మ్యాచ్ ముగియగానే భారత కెప్టెన్ విరాట్ కోహ్లి చేతికి టెస్టు గద రానుంది. ఏటా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం నిలిచిన జట్టు‌కి ఐసీసీ నజరానాతో పాటు టెస్టు గద ఇవ్వనున్న విషయం తెలిసిందే. తాజాగా ర్యాంకింగ్స్‌లో భారత్ జట్టు 121 పాయింట్లతో నెం.1 స్థానంలో కొనసాగుతుండగా.. తర్వాత దక్షిణాఫ్రికా (115), ఆస్ట్రేలియా (104), న్యూజిలాండ్ (100), ఇంగ్లాండ్ (99) జట్లు టాప్-5లో ఉన్నాయి. ఏప్రిల్ 3న కటాఫ్ డేట్ ఉండగా.. అప్పటిలోపు ఏ జట్టూ కూడా భారత్‌ని అధిగమించే అవకాశం లేకపోవడంతో టీమిండియాకే నజరానాతో పాటు గదని శనివారమే ఇవ్వాలని ఐసీసీ నిర్ణయించింది. గత ఏడాది కూడా కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ గదని అందుకున్న విషయం తెలిసిందే.
Samayam Telugu kohli to be presented with test mace after cape town t20
చివరి టీ20లో కోహ్లి చేతికి టెస్టు ‘గద’


ఈరోజు రాత్రి 9.30 నుంచి జరగనున్న మూడో టీ20 మ్యాచ్ ముగియగానే భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ పొలాక్ చేతుల మీదుగా విరాట్ కోహ్లి ఆ గదని అందుకోనున్నట్లు ఐసీసీ తాజాగా ప్రకటించింది. ఈ గదతో పాటు భారత్‌ జట్టుకి నజరానా రూపంలో సుమారు రూ. 6.5 కోట్లని ఐసీసీ ఇవ్వనుంది. 124 పాయింట్లతో దక్షిణాఫ్రికా పర్యటనని ఆరంభించిన భారత్.. మూడు టెస్టుల సిరీస్‌ని 1-2తో చేజార్చుకుని 121 పాయింట్లకి చేరుకుంది. దక్షిణాఫ్రికా రెండు టెస్టుల్లో విజయం సాధించడం ద్వారా 111 పాయింట్ల నుంచి 115కి చేరుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.