యాప్నగరం

ఐపీఎల్ వేలం: ఈసారి ఖరీదైన ఇండియన్ పీయూష్ చావ్లా

ఐపీఎల్ వేలంలో మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ డేరింగ్ డెసిషన్ తీసుకుంది. యూపీ స్పిన్నర్ పీయూష్ చావ్లాను రూ.6.75 కోట్లకు కొనుగోలు చేసింది.

Samayam Telugu 19 Dec 2019, 6:02 pm
ఈసారి ఐపీఎల్ వేలంలో భారత స్పిన్నర్ పీయూష్ చావ్లా అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ఇండియన్ ప్లేయర్‌గా నిలిచాడు. చావ్లాను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.6.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ ఏడాది వేలంలో ఇప్పటి వరకూ అత్యధిక ధర పలికిన భారత ఆటగాడు ఇతడే.
Samayam Telugu chawla 3


Read Also: undefined

మరోవైపు ఐపీఎల్ వేలం హాట్‌హాట్‌గా సాగుతోంది. ఎవరూ ఊహించని విధంగా పాట్ కమిన్స్‌ను అత్యధిక ధర పలికింది. కోల్‌కతా రూ.15.50 కోట్లు వెచ్చించి తనను కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (రూ.16 కోట్లు) తర్వాత అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. మొత్తంమీద అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్‌గా రికార్డు దక్కించుకున్నాడు.

Read Also: undefined

ఇప్పటివరకు అమ్ముడైన ఆటగాళ్లలో శామ్ కరన్ (5.50 కోట్లు-చెన్నై), క్రిస్ మోరిస్ (10 కోట్లు-ఆర్సీబీ), అలెక్స్ కారీ (రూ.2.4 కోట్లు-ఢిల్లీ), యశస్వి జైస్వాల్ (2.40 కోట్లు-రాజస్థాన్), వరుణ్ చక్రవర్తి (4 కోట్లు-కోల్‌కతా), షెల్డన్ కాట్రెల్ (రూ.8.5 కోట్లు-పంజాబ్), నేథన్ కౌల్టర్‌నీల్ (8 కోట్లు-ముంబై)ఉన్నారు.
అమ్ముడుపోని ఆటగాళ్లలో జహీర్ ఖాన్ (అఫ్గానిస్తాన్), ఐష్ సోధీ, ఆడమ్ జంపా, హేడెన్ వాల్ష్, మన్‌జ్యోత్ కల్రా, రోహన్ కదమ్, హర్‌ప్రీత్ భాటియా, తెలుగు ప్లేయర్ కేఎస్ భరత్ ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.