యాప్నగరం

షమీ కేసు: బీసీసీఐ తలుపు తట్టిన కోల్‌కతా పోలీసులు

వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ షమీపై అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కోల్‌కతా పోలీసులు బీసీసీఐని ఆశ్రయించారు.

Samayam Telugu 12 Mar 2018, 1:49 pm
భార్య ఫిర్యాదుతో మహ్మద్ షమీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన కోల్‌కతా పోలీసులు.. విచారణలో భాగంగా బీసీసీఐ తలుపు తట్టారు. షమీ దక్షిణాఫ్రికా పర్యటన వివరాలు అందజేయాలని వారు క్రికెట్ బోర్డును కోరారు. భారత క్రికెట్ జట్టు ప్రయాణ వివరాలు అందజేయాలని కోరుతూ మంగళవారం కోల్‌కతా పోలీసులు బీసీసీఐకి లేఖ రాశారు. డిసెంబర్ చివర్లో భారత జట్టు దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లింది. ఆ పర్యటన ఆసాంతం షమీ జట్టుతోనే ఉన్నాడా? లేదంటే ఎక్కడికైనా వెళ్లాడా అనే వివరాలు అందజేయాలని పోలీసులు కోరుతున్నారు.
Samayam Telugu kolkata police ask bcci for mohammed shamis south africa tour details
షమీ కేసు: బీసీసీఐ తలుపు తట్టిన కోల్‌కతా పోలీసులు


భారత జట్టులోని ఇతర ఆటగాళ్లు దక్షిణాఫ్రికా నుంచి తిరిగి రాగా.. షమీ మాత్రం దుబాయ్‌లోనే ఉండిపోయాడని, ఫిబ్రవరి 18న అక్కడ హోటల్‌లో పాకిస్థానీ మహిళతో గడిపాడని అతడి భార్య హసీన్ జహాన్ ఆరోపిస్తోంది. అందుకే టెస్టు, వన్డే సిరీస్ ఆడిన షమీ మిగతా ఆటగాళ్లతోపాటే సఫారీ గడ్డ నుంచి తిరిగి ప్రయాణమయ్యాడా? లేదంటే దుబాయ్‌లో గడిపి.. సొంత ఖర్చులతో భారత్ వచ్చాడా అనే వివరాలను పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.