యాప్నగరం

భారత్ అతడ్ని తప్పించి తప్పు చేసిందా..?

కృనాల్‌ పాండ్యాని లక్ష్యంగా చేసుకున్న ఆసీస్ హిట్టర్ గ్లెన్ మాక్స్‌వెల్ హ్యాట్రిక్ సిక్సర్లతో పాటు మొత్తంగా నాలుగు సిక్సర్లు బాదేశాడు.

Samayam Telugu 22 Nov 2018, 6:11 pm
ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా బుధవారం రాత్రి ముగిసిన తొలి టీ20 మ్యాచ్‌లో గెలుపు ముంగిట భారత్ తడబడటంపై అభిమానులు ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా.. తుది జట్టు ఎంపిక సరిగా లేదని.. మణికట్టు స్పిన్నర్ చాహల్‌ని తప్పించి భారీ మూల్యం చెల్లించుకుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. బీసీసీఐ బుధవారం ప్రకటించిన 12 మందితో కూడిన జట్టులో చాహల్‌ని నిన్న తుది జట్టు నుంచి తప్పించిన టీమిండియా మేనేజ్‌మెంట్ కృనాల్‌ పాండ్యాకి ఛాన్సిచ్చింది. అయితే.. ఈ యువ ఆల్‌రౌండర్ బంతి, బ్యాట్‌తోనూ ఘోరంగా విఫలమయ్యాడు.
Samayam Telugu krunal pandya brutally trolled on twitter after disappointing show against australia in 1st t20
భారత్ అతడ్ని తప్పించి తప్పు చేసిందా..?


కృనాల్‌ పాండ్యాని లక్ష్యంగా చేసుకున్న ఆసీస్ హిట్టర్ గ్లెన్ మాక్స్‌వెల్ హ్యాట్రిక్ సిక్సర్లతో పాటు మొత్తంగా నాలుగు సిక్సర్లు బాదేశాడు. దీంతో.. మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్ ఏకంగా 55 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత బ్యాట్‌తోనూ కృనాల్‌ 4 బంతుల్లో 2 పరుగులే చేసి కీలక సమయంలో ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 4 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే.

అనుభవం ఉన్న చాహల్‌ని తప్పించి.. కృనాల్‌ పాండ్యాకి అవకాశం ఇవ్వడం ద్వారా టీమిండియా పెద్ద తప్పిదానికి పాల్పడిందని మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడుతున్నారు. రెండో టీ20 మ్యాచ్ మెల్‌బోర్న్ వేదికగా శుక్రవారం జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.