యాప్నగరం

ప్రపంచకప్‌లో ఆడాలని ఉంది: కృనాల్ పాండ్య‌

భారత జట్టు తరఫున ‘ప్రపంచకప్ 2019’‌లో ఆడాలని ఉందని హార్దిక్ పాండ్య సోదరుడు కృనాల్ పాండ్య ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది

Samayam Telugu 24 Aug 2018, 5:55 pm
భారత జట్టు తరఫున ‘ప్రపంచకప్ 2019’‌లో ఆడాలని ఉందని హార్దిక్ పాండ్య సోదరుడు కృనాల్ పాండ్య ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది ముగిసిన ఐపీఎల్ 2018 సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున మెరుగ్గా ఆడినా కృనాల్.. భారత-ఎ జట్టులోనూ మెరిశాడు. అయినప్పటికీ ఇంగ్లాండ్‌తో సిరీస్‌ కోసం ఇటీవల ఎంపిక చేసిన భారత జట్టులో అతనికి చోటు లభించలేదు. అయితే.. తన అంతిమ లక్ష్యం భారత్ తరఫున ఆడటమేనని వెల్లడించిన కృనాల్.. ఆ దిశగా ఆటలో మెరుగులు దిద్దుకుంటూ అడుగులు వేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
Samayam Telugu ..


‘నా క్రికెట్ కెరీర్‌ చాలా గొప్పగా సాగుతోంది. మూడేళ్ల నుంచి ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతూ.. ఈ స్థాయికి చేరుకున్నా. ఇప్పుడు భారత్ -ఎ జట్టు‌లో ఆడుతున్నా.. ఇలానే టోర్నమెంట్లు ఆడుతూ టీమిండియా తరఫున ప్రపంచకప్ 2019లో ఆడాలనేది నా అంతిమ లక్ష్యం. ఆ దిశగానే గత కొంతకాలంగా అడుగులు వేస్తున్నా.. తప్పకుండా నా కలని నెరవేర్చుకుంటా’ అని కృనాల్ పాండ్య ధీమా వ్యక్తం చేశాడు.

ఎడమచేతి వాటం బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్ చేసే కృనాల్ పాండ్య ఐపీఎల్ మూడు సీజన్లలో 708 పరుగులు చేసి 28 వికెట్లు పడగొట్టాడు. మిడిలార్డర్‌లో హిట్టింగ్ చేస్తూ అమాంతం స్కోరు పెంచడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన ఈ ఆల్‌రౌండర్ ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ మ్యాచ్‌లను మలుపు తిప్పే వికెట్లతో సెలక్టర్లను ఆకర్షించాడు. కానీ.. అతను కోరుకున్న టీమిండియాలోకి మాత్రం పిలుపు రాలేదు. మరోవైపు అతని సోదరుడు హార్దిక్ పాండ్య.. భారత జట్టులో సుస్థిర స్థానం సంపాదించగలిగాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.