యాప్నగరం

ఫస్ట్ మ్యాచ్‌లోనే కుంబ్లే ఐదు వికెట్లు పడగొట్టాలన్నాడు: కుల్దీప్

కుల్దీప్ యదవ్ ఆడిన తొలి టెస్టు మ్యాచ్‌లోనే కంగారూలను ఉక్కిరిబిక్కిరి చేశాడు. అతని బౌలింగ్‌ని అర్థం చేసుకోలేకపోయిన వార్నర్, మాక్స్‌వెల్ పేలవంగా వికెట్లు చేజార్చుకోగా.. భారత్ 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

Samayam Telugu 2 May 2020, 8:21 pm
టీమిండియా తరఫున అరంగేట్రం టెస్టు మ్యాచ్‌లో తాను ఒత్తిడికి గురైనట్లు మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వెల్లడించాడు. 2017లో ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కుల్దీప్ యాదవ్ తొలి ఇన్నింగ్స్‌లోనే నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. వాస్తవానికి ఆ మ్యాచ్‌కి ముందే కుల్దీప్‌తో మాట్లాడిన అప్పటి టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే ఐదు వికెట్లు పడగొట్టాలని సూచించాడట. ఆ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కుల్దీప్ యాదవ్ వెల్లడించాడు.
Samayam Telugu Visakhapatnam: Indian spin bowler Kuldeep Yadav before the start of 2nd day of t...


‘‘ధర్మశాల టెస్టుకి ముందు నేను ఎమోషన్‌కి గురయ్యాను. మ్యాచ్‌కి ఒక్కరోజు ముందు నా వద్దకి వచ్చిన అనిల్ కుంబ్లే సార్.. నువ్వు రేపు మ్యాచ్‌లో ఆడబోతున్నావు.. ఐదు వికెట్లు పడగొట్టాలి అని సూచించాడు. దాంతో.. కొన్ని క్షణాలు ఆలోచించి అలాగే సర్ అని బదులిచ్చాను. మ్యాచ్‌ ఆరంభంలో ఒత్తిడికి గురైనా.. ఓ రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన తర్వాత రిలాక్స్ అయిపోయా. మొత్తంగా.. ఆ మ్యాచ్‌ని రంజీ గేమ్‌లా భావించి ఆడేశాను’’ అని కుల్దీప్ యాదవ్ వెల్లడించాడు.

తొలి టెస్టు మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ డేవిడ్ వార్నర్, హిట్టర్ గ్లెన్ మాక్స్‌వెల్, పీటర్ హాండ్స్‌కబ్, పాట్ కమిన్స్ వికెట్లని కుల్దీప్ యాదవ్ పడగొట్టగా.. ఆ మ్యాచ్‌లో ఆఖరికి టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.