యాప్నగరం

కుల్దీప్ తన ముద్ర వేసేశాడు: రైనా

భారత జట్టు బౌలింగ్‌ విభాగంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ తన బలమైన ముద్ర వేశాడని సురేశ్ రైనా ప్రశంసించాడు

TNN 12 Oct 2017, 6:19 pm
భారత జట్టు బౌలింగ్‌ విభాగంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ తన బలమైన ముద్ర వేశాడని సురేశ్ రైనా ప్రశంసించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌లో పొదుపుగా బౌలింగ్ చేస్తూ భారత్ విజయంలో ఈ యువ స్పిన్నర్ కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌ని భారత్ 4-1తేడాతో దక్కించుకోగా.. మూడు టీ20ల సిరీస్‌ 1-1తో సమమైంది. హైదరాబాద్ వేదికగా శుక్రవారం నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో సురేశ్ రైనా మాట్లాడాడు. గత కొంతకాలంగా భారత సెలక్టర్లు రైనాని జట్టులోకి ఎంపిక చేయకుండా పక్కన పెడుతున్నారు.
Samayam Telugu kuldeep yadav will change everything in bowling department say suresh raina
కుల్దీప్ తన ముద్ర వేసేశాడు: రైనా


‘కుల్దీప్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శనతో దూసుకెళ్తున్నాడు. ఈ ఘనత అంతా మాజీ కోచ్ అనిల్ కుంబ్లేకే దక్కాలి. ఎందుకంటే.. ఈ చైనామన్ బౌలర్‌ని తీర్చిదిద్దే క్రమంలో కోచ్‌గా చాలా కష్టపడ్డాడు. ఈ ఏడాది ఐపీఎల్ సమయంలో కుల్దీప్‌తో నేను ఒకసారి మాట్లాడాను. అతను అనిల్ కుంబ్లే‌తో ప్రతిరోజూ చాట్ చేస్తూ తన బౌలింగ్‌‌కి మెరుగులు దిద్దుకుంటున్నాడని నాకు అర్థమైంది. కాబట్టి.. కుల్దీప్ కచ్చితంగా కుంబ్లే తయారు చేసిన స్పిన్నరే. ఆస్ట్రేలియాకి చెందిన చైనామన్ బౌలర్ బ్రాడ్‌ హగ్ కూడా కుల్దీప్‌‌కి ఐపీఎల్ సమయంలో చాలా విలువైన సలహాలు ఇచ్చాడు. ఏది ఏమైనా.. ప్రస్తుతం భారత్ జట్టు బౌలింగ్‌ విభాగాన్ని కుల్దీప్ యాదవ్ సమూలంగా మార్చేసి తన ముద్ర వేసేశాడు’ అని రైనా వివరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.