యాప్నగరం

అందరితో పోలిస్తే కుల్దీప్ టెక్నిక్ ప్రత్యేకం

ఇంగ్లాండ్‌‌తో మంగళవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో అందరి దృష్టినీ

Samayam Telugu 5 Jul 2018, 1:56 pm
ఇంగ్లాండ్‌‌తో మంగళవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆ మ్యాచ్‌లో మొత్తం 4 ఓవర్లు బౌలింగ్‌ చేసిన కుల్దీప్ 24 పరుగులిచ్చి ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. ఓ ఎడమచేతి వాటం స్పిన్నర్ టీ20 మ్యాచ్‌లో ఐదు వికెట్ల మార్క్‌ని అందుకోవడం ఇదే తొలిసారి. భారత విజయంలో క్రియాశీలక పాత్ర పోషించిన కుల్దీప్‌ బౌలింగ్‌పై మాజీ క్రికెటర్ మోహిందర్ అమరనాథ్ పొగడ్తల వర్షం కురిపించాడు. భారత్ ,ఇంగ్లాండ్ మధ్య శుక్రవారం రాత్రి 10 గంటలకి రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.
Samayam Telugu ..


‘ఇంగ్లాండ్ పర్యటనని భారత జట్టు అద్భుత విజయంతో ఆరంభించింది. ఆతిథ్య జట్టుని ఒత్తిడిలోకి నెట్టాలంటే పర్యాటక జట్టుకి ఈ విధమైన బోణి చాలా అవసరం. టీ20 అత్యుత్తమ జట్లలో ఒకటైన భారత్‌కి అనుభవం కూడా తోడవడంతోనే అలవోక విజయాన్ని అందుకోగలిగింది. ఇక కుల్దీప్ యాదవ్ 5/24 బౌలింగ్ ప్రదర్శన నన్నేమి ఆశ్చర్యపరచలేదు. అతను ఇంకా యువకుడు.. మ్యాచ్‌లు ఆడేకొద్దీ మరింత రాటుదేలుతాడు. మిగతా స్పిన్నర్లలా వైడ్‌ లేదా ఆఫ్ స్టంప్‌కి దూరంగా బంతుల్ని కుల్దీప్ విసరడు. బ్యాట్స్‌మెన్ శరీరంపైకి బంతిని టర్న్ చేస్తూ వికెట్లు పడగొట్టడం అతని ప్రత్యేకత. ప్రస్తుతం ఈ మణికట్టు స్పిన్నర్ వికెట్ల దాహంతో ఉన్నాడు’ అని అమరనాథ్ ప్రశంసించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.