యాప్నగరం

2007 టీ20 ప్రపంచకప్‌పై సచిన్ బాధపడ్డాడు: లాల్‌చంద్

భారత్‌కి వరల్డ్‌కప్ అందించాలనేది అప్పట్లో సచిన్ చిరకాల కోరిక. 2007 టీ20 ప్రపంచకప్‌ని టీమిండియా గెలిచినా.. ఆ జట్టులో సచిన్ లేడు. దానికి కారణం.. రాహుల్ ద్రవిడ్.

Samayam Telugu 30 Jun 2020, 8:14 am
దక్షిణాఫ్రికా వేదికగా 2007లో జరిగిన ఫస్ట్ టీ20 వరల్డ్‌కప్‌లో ఆడలేనందుకు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అప్పట్లో చాలా బాధపడ్డాడని భారత జట్టు మాజీ మేనేజర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ వెల్లడించాడు. ఆ వరల్డ్‌కప్‌లో యువ క్రికెటర్లకి అవకాశమివ్వాలని సచిన్, సౌరవ్ గంగూలీకి సూచించిన రాహుల్ ద్రవిడ్.. తాను కూడా ఆ టోర్నీకి దూరంగా ఉండిపోయాడు. మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా.. ఫైనల్‌లో పాకిస్థాన్‌ని ఓడించి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
Samayam Telugu ​Sachin Tendulkar


1989లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సచిన్ టెండూల్కర్.. భారత్‌కి ప్రపంచకప్‌ అందించాలనే చిరకాల వాంఛతో అప్పట్లో ఉన్నాడు. కానీ.. ద్రవిడ్ సూచనతో 2007 టీ20 ప్రపంచకప్‌కి అతను దూరంగా ఉండగా.. ఆ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. దాంతో.. ఆ జట్టులో తను లేనందుకు సచిన్ చాలా బాధపడ్డాడని లాల్‌చంద్ రాజ్‌పుత్ వెల్లడించాడు. సచిన్ ఒక్కడే కాదు.. గంగూలీ, ద్రవిడ్ కూడా చింతించి ఉంటారని అతను చెప్పుకొచ్చాడు.

‘‘సచిన్ అప్పట్లో నాతో తరచూ ఓ మాట అనేవాడు. చాలా ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నాను.. కానీ.. ఒకసారి కూడా ప్రపంచకప్‌ గెలవలేదు అని. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఆడలేందుకు సచిన్‌తో పాటు ద్రవిడ్, గంగూలీ కూడా విచారం వ్యక్తం చేశారు. వాస్తవానికి సచిన్, గంగూలీని ఆ టోర్నీలో ఆడొద్దని సూచించింది రాహుల్ ద్రవిడ్. యువ క్రికెటర్లకి అవకాశమివ్వడం కోసం ఆ టోర్నీకి దూరంగా ఉండాలని ఆ దిగ్గజాలు నిర్ణయించుకున్నారు’’ అని లాల్‌చంద్ రాజ్‌పుత్ వెల్లడించాడు. 2011 వన్డే ప్రపంచకప్‌‌ని భారత్ గెలవగా.. సచిన్‌ని సహచరులందరూ భుజాలపై ఎత్తుకుని మైదానంలో ఊరేగించిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.