యాప్నగరం

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ జట్టులో పూనమ్‌కి చోటు

ఐసీసీ ప్రకటించిన టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో ఏకంగా ఐదుగురు ఆస్ట్రేలియా క్రికెటర్లకి చోటు లభించగా.. ఇంగ్లాండ్ నుంచి నలుగురు, భారత్ నుంచి ఇద్దరు, దక్షిణాఫ్రికా నుంచి ఒకరికి ఛాన్స్ దక్కింది.

Samayam Telugu 9 Mar 2020, 5:57 pm
ఆస్ట్రేలియా గడ్డపై ఆదివారం ముగిసిన ఉమెన్స్ టీ20 వరల్డ్‌‌కప్‌లో.. క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగా ఓ జట్టుని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. 12 మందితో కూడిన ఈ జట్టులో భారత్ నుంచి ఇద్దరు క్రికెటర్లకి మాత్రమే అవకాశం దక్కింది. టోర్నీలో 10 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్ పూనమ్ యాదవ్‌కి తుది జట్టులో చోటు లభించగా.. యువ ఓపెనర్ షెఫాలి వర్మ‌‌కి 12వ ప్లేయర్‌గా ఛాన్స్ దక్కింది.
Samayam Telugu Sydney: Indias Poonam Yadav, right, bowles against Australia during the first ...


Read More: కామెడీ అంటే ఇదే..? క్యాచ్ వదిలేసి బ్యాట్స్‌మెన్ కాళ్లు పట్టుకున్న వికెట్ కీపర్

వాస్తవానికి టోర్నీ ఆరంభంలో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడిన షెఫాలి వర్మ.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. కానీ.. మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 2 పరుగులకే ఔటవడంతో ఆమె నెం.1 ర్యాంక్‌ని చేజార్చుకోవడంతో పాటు ఐసీసీ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోలేకపోయింది. మరోవైపు పూనమ్ యాదవ్ ఫైనల్లో నిరాశపరిచినప్పటికీ.. టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై మెరుగైన ప్రదర్శన చేయడం ద్వారా జట్టుని గెలిపించి ప్రశంసలు అందుకుంది.

Read More: టీ20 ర్యాంకింగ్స్‌లో షెఫాలికి చేజారిన నెం.1

ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్ జట్టు: 1. అలెక్స్ హేలీ (ఆస్ట్రేలియా), 2. బెత్ మూనీ (ఆస్ట్రేలియా), 3. స్కైవర్ (ఇంగ్లాండ్), 4. హీథర్ నైట్ (ఇంగ్లాండ్), 5. లానింగ్ (ఆస్ట్రేలియా, కెప్టెన్), 6. లౌరా (దక్షిణాఫ్రికా), 7. జోనసీన్ (ఆస్ట్రేలియా), 8. సూపీ (ఇంగ్లాండ్), 9. అన్యా (ఇంగ్లాండ్), 10. మేగన్ స్కట్ (ఆస్ట్రేలియా), 11. పూనమ్ యాదవ్ (భారత్), 12. షెఫాలి వర్మ (భారత్)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.