యాప్నగరం

ఐదో టెస్టు: లంచ్ విరామానికి ఇంగ్లాండ్ 68/1

ఓపెనింగ్ జోడీని విడదీసేందుకు తొలి సెషన్ ఆఖరి వరకూ శ్రమించిన భారత బౌలర్లు.. ఎట్టకేలకి 24వ ఓవర్‌లో సఫలమయ్యారు.

Samayam Telugu 7 Sep 2018, 5:45 pm
భారత్‌తో ఓవల్ వేదికగా ఈరోజు ఆరంభమైన ఐదో టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ జట్టు లంచ్ విరామ సమయానికి 68/1తో నిలిచింది. కెరీర్‌లో ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడుతున్న వెటరన్ ఓపెనర్ అలిస్టర్ కుక్ (37 బ్యాటింగ్: 77 బంతుల్లో 4x4) ఆచితూచి బ్యాటింగ్ చేస్తుండగా.. అతనితో పాటు క్రీజులో మొయిన్ అలీ (2 బ్యాటింగ్: 16 బంతుల్లో) ఉన్నాడు.
Samayam Telugu England v India - Fifth Test


మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ.. ఓపెనర్లు అలిస్టర్ కుక్, జెన్నింగ్స్ (23: 75 బంతుల్లో 2x4) తొలి వికెట్‌కి 60 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభమిచ్చారు. ఈ ఓపెనింగ్ జోడీని విడదీసేందుకు తొలి సెషన్ ఆఖరి వరకూ శ్రమించిన భారత బౌలర్లు.. ఎట్టకేలకి 24వ ఓవర్‌లో సఫలమయ్యారు. ఇన్నింగ్స్‌ 24వ ఓవర్ వేసిన రవీంద్ర జడేజా బౌలింగ్‌లో బంతిని వెనక్కి నెట్టేందుకు ప్రయత్నించిన జెన్నింగ్స్.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ చేతికి చిక్కాడు. స్లిప్‌లో క్లిష్టతరమైన క్యాచ్‌లని సైతం అలవోకగా పట్టేస్తూ సిరీస్‌లో ఆకట్టుకుంటున్న కేఎల్ రాహుల్ మరోసారి మెరుపు ఫీల్డింగ్‌తో మెరిశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.