యాప్నగరం

రషీద్‌ని ఢీకొట్టి పరుగులు రాబడతా: ధావన్

అఫ్గనిస్థాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్‌ని సమర్థంగా ఎదుర్కొని త్వరలో జరగనున్న ఏకైక టెస్టులో పరుగులు రాబడతానని భారత ఓపెనర్ శిఖర్ ధావన్

Samayam Telugu 29 May 2018, 2:50 pm
అఫ్గనిస్థాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్‌ని సమర్థంగా ఎదుర్కొని త్వరలో జరగనున్న ఏకైక టెస్టులో పరుగులు రాబడతానని భారత ఓపెనర్ శిఖర్ ధావన్ ధీమా వ్యక్తం చేశాడు. జూన్ 14 నుంచి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్, అఫ్గనిస్థాన్‌ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్‌లో ధావన్‌, రషీద్ ఖాన్ ఇద్దరూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకే ఆడటంతో.. అతడ్ని ఎదుర్కొనే అవకాశం ఇంతవరకూ ధావన్‌కి రాలేదు. దీంతో.. రషీద్‌ని ఎదుర్కోవడం కష్టమే అయినా.. సవాల్‌గా తీసుకుని ఆడతానని ధావన్‌ వెల్లడించాడు.
Samayam Telugu looking ahead to scoring against rashid khan says shikhar dhawan
రషీద్‌ని ఢీకొట్టి పరుగులు రాబడతా: ధావన్


‘రషీద్ ఖాన్ బౌలింగ్‌ని తొలిసారి ఎదుర్కోబోతున్నాను. అతడి స్పిన్‌ని ఛేదించాలంటే చాలా కష్టమని నాకు తెలుసు. కానీ.. అత్యుత్తమంగా ఆడేందుకు ప్రయత్నిస్తా. ఏకైక టెస్టులో బరిలోకి దిగే భారత తుది జట్టులో నాకు అవకాశం దక్కితే.. రషీద్ ఖాన్ బౌలింగ్‌‌ రూపంలో నాకు ఓ కఠిన సవాల్ ఎదురుకానుంది’ అని ధావన్ వెల్లడించాడు. భారత టెస్టు జట్టులో మురళీ విజయ్, కేఎల్ రాహుల్ రూపంలో ఓపెనింగ్ స్థానానికి పోటీ పెరగడంపై మాట్లాడుతూ ‘భారత జట్టులో ఇలా పోటీ పెరగడం మంచిదే. ముగ్గరం మంచి అనుభవం ఉన్న ఓపెనర్లం. ఇటీవల ముగిసిన ఐపీఎల్ కేఎల్ రాహుల్ చాలా బాగా ఆడాడు. తుది జట్టులో స్థానం నిలుపుకోవడం ఒకింత ఒత్తిడితో కూడుకున్నదే. కానీ.. ప్రతి జట్టులోనూ ఇలాంటి ఒత్తిడి సహజం’ అని శిఖర్ ధావన్ వివరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.