యాప్నగరం

కోహ్లి చెప్పడం లేదు.. చేసి చూపిస్తున్నాడు..!

భారత జట్టును కెప్టెన్ విరాట్ కోహ్లి ముందుండి నడిపిస్తుండగా.. అతడ్ని మిగిలిన క్రికెటర్లు ఫాలో అవుతున్నారని

TNN 23 Aug 2017, 4:34 pm
భారత జట్టును కెప్టెన్ విరాట్ కోహ్లి ముందుండి నడిపిస్తుండగా.. అతడ్ని మిగిలిన క్రికెటర్లు ఫాలో అవుతున్నారని శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనె అభిప్రాయపడ్డాడు. భారత్, శ్రీలంక మధ్య గురువారం పల్లెకలె వేదికగా రెండో వన్డే జరగనున్న నేపథ్యంలో జయవర్దనె తాజాగా మీడియాతో మాట్లాడాడు. టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ కావడంతో ప్రస్తుతం లంకేయుల స్థైర్యం దెబ్బతిందని.. తప్పిదాలను వేగంగా దిద్దుకోలేకపోతే ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌ కూడా చేజార్చుకునే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించాడు.
Samayam Telugu mahela jayawardene praises pro active captain virat kohli
కోహ్లి చెప్పడం లేదు.. చేసి చూపిస్తున్నాడు..!


‘విరాట్ కోహ్లి క్రియాశీలక కెప్టెన్. అతను మైదానంలో చాలా దూకుడుగా ఉంటాడు. ఆదిలోనే కెప్టెన్‌గా అతనికి మెరుగైన ఆరంభం లభించింది. ఇప్పుడు భారత్‌లోనే కాదు.. విదేశీగడ్డపై కూడా ఆ విజయాల పరంపరని కొనసాగిస్తున్నాడు. జట్టులో అతనే ముందుండి తొలుత బాధ్యతలు తీసుకుంటున్నాడు. దీంతో మిగిలిన వాళ్లు కూడా.. అతడ్ని ఫాలో అవుతున్నారు. టెస్టులో నెం.1గా ఉన్న భారత్ జట్టుని ఓడించడం ఏ జట్టుకైనా సవాలే. సిరీస్ ఓటమితో ఇప్పటికే శ్రీలంక ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతింది. తొలి వన్డేలో అది మరింత స్పష్టమైంది’ అని జయవర్దనె వివరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.