MS Dhoni: అరుదైన క్లబ్లో మహేంద్ర సింగ్ ధోనీ
ఆసీస్పై వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాదిన ధోనీ అరుదైన క్లబ్లో చేరాడు. 193 పరుగులతో సత్తా చాటిన మహీ.. ఆసీస్ గడ్డ మీద వన్డేల్లో వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాట్స్మెన్గా రికార్డ్ క్రియేట్ చేశాడు.
Samayam Telugu 18 Jan 2019, 6:16 pm
ప్రధానాంశాలు:
- ఆసీస్పై వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాదిన ధోనీ అరుదైన క్లబ్లో చేరాడు.
- 193 పరుగులతో సత్తా చాటిన మహీ.. ఆసీస్ గడ్డ మీద వన్డేల్లో వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
- ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాట్స్మెన్గా రికార్డ్ క్రియేట్ చేశాడు.
హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన ధోనీ ఖాతాలో అరుదైన రికార్డ్ చేరింది. మెల్బోర్న్ వన్డేలో మహీ 87 పరుగులతో నాటౌట్గా నిలవడంతో ఆసీస్ గడ్డ మీద భారత్ తొలి ద్వైపాక్షిక సిరీస్ను గెలుపొందింది. వరుసగా 51, 55*, 87*తో సత్తా చాటిన ధోనీ.. ఆస్ట్రేలియాలో వన్డేల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాట్స్మెన్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకూ సచిన్, కోహ్లి, రోహిత్ శర్మ మాత్రమే ఆస్ట్రేలియాలో వన్డేల్లో వెయ్యికిపైగా పరుగులు చేశారు. మెల్బోర్న్ వన్డేలో 36 పరుగులు చేయగానే మహీ వీరి సరసన చేరాడు. మూడు వన్డేల్లో కలిపి ధోనీ 73.10 స్ట్రైక్ రేట్తో 193 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. కెరీర్లో మహీకి ఇది ఏడో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కావడం విశేషం.