యాప్నగరం

మాలిక్.. నీ రిటైర్మెంట్ గొప్ప సాయం: రమీజ్

పాక్ టీమ్‌ని నడిపించడంలో ఫెయిలవుతున్నాడని సర్ఫరాజ్ అహ్మద్‌ని గత ఏడాది కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. కనీసం ఆటగాడిగా కూడా టీమ్‌లో ఛాన్స్ ఇవ్వలేదు.

Samayam Telugu 6 Apr 2020, 8:35 pm
పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్లు రిటైర్మెంట్ ఇవ్వడమే ఆ జట్టుకి చేసే గొప్ప సాయమని ఆ దేశ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా అభిప్రాయపడ్డాడు. ఇటీవల పాక్ టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్.. అక్టోబరులో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాలని ఆశిస్తున్నారు. కానీ.. అప్పటిలోపే వీడ్కోలు చెప్తే..? మరీ మంచిదని రమీజ్ రాజా చెప్పుకొచ్చాడు. హఫీజ్ వయసు 39 ఏళ్లుకాగా.. షోయబ్ మాలిక్ ఏజ్ 38.
Samayam Telugu Shoaib Malik


‘‘మాలిక్, హఫీజ్ ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తే..? టీమ్‌లో స్థానం కోసం ఎదురుచూస్తున్న యువ క్రికెటర్లతో కలిసి జట్టుని సిద్ధం చేసుకునే వెసులబాటు ఉంటుంది. సుదీర్ఘకాలం ఈ ఇద్దరు క్రికెటర్లు పాక్ టీమ్‌కి మెరుగైన సేవలు అందించారనే విషయం నాకు తెలుసు. కానీ.. గౌరవంగా వీడ్కోలు చెప్పేందుకు వారికి ఇదే తగిన సమయమని నా భావన. ఒకవేళ వాళ్లు ఇప్పుడే వీడ్కోలు చెప్తే.. అది పాక్ టీమ్‌కి ఉపయోగపడనుంది’’ అని రమీజ్ రాజా చెప్పుకొచ్చాడు.

పాకిస్థాన్ చీఫ్ కోచ్, సెలక్టర్‌గా మిస్బావుల్ హక్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సీనియర్ క్రికెటర్లు మాలిక్, హఫీజ్, ఉమర్ అక్మల్ తదితరులకి టీమ్‌లో మళ్లీ అవకాశాలిచ్చాడు. కానీ.. ఎవరూ ఆశించిన మేర రాణించలేకపోయారు. దీంతో.. యువ క్రికెటర్లకి ఛాన్స్‌లివ్వడం ద్వారా టీమ్‌ని సిద్ధం చేసుకోవాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) యోచిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.