యాప్నగరం

మలింగ మళ్లీ మైదానంలోకి వస్తున్నాడు..!

యార్కర్లతో బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించే శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ్ దాదాపు ఏడాది విరామం తర్వాత మళ్లీ బంతి అందుకోనున్నాడు.

TNN 9 Feb 2017, 6:41 pm
యార్కర్లతో బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించే శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ్ దాదాపు ఏడాది విరామం తర్వాత మళ్లీ బంతి అందుకోనున్నాడు. మెకాలి గాయం, అనారోగ్యం కారణంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న మలింగ ఫిబ్రవరి 17 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కి ఎంపికయ్యాడు. గత ఏడాది ఫిబ్రవరిలో ఆసియా కప్‌లో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో మలింగ గాయపడ్డాడు. అనంతరం జరిగిన టీ20 ప్రపంచకప్‌కు దూరమైన మలింగ.. గాయం నుంచి కోలుకోకపోవడంతో.. ఐపీఎల్ -9 సీజన్‌కు కూడా దూరంగా ఉండాల్సి వచ్చింది.
Samayam Telugu malinga in 15 man squad for australia t20is
మలింగ మళ్లీ మైదానంలోకి వస్తున్నాడు..!


ఇటీవల ముగిసిన దక్షిణఫ్రికా సిరీస్ ప్రారంభ సమయానికే అతడు గాయం నుంచి కోలుకున్నాడు. కానీ కొద్ది రోజుల్లో సిరీస్ ప్రారంభం అవుతుందనగా.. డెంగ్యూ జ్వరం బారిన పడటంతో సఫారీ టూర్‌కు వెళ్లలేకపోయాడు. శ్రీలంక కెప్టెన్ మాథ్యూస్ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. దీంతో అతడి స్థానంలో ఉపుల్ తరంగ టీ20 సిరీస్‌లో లంక జట్టును ముందుకు నడిపించనున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.