యాప్నగరం

ఇంగ్లాండ్‌పై రెండో టెస్టులో పోరాడుతున్న వెస్టిండీస్.. ఈరోజే లాస్ట్

వెస్టిండీస్‌ని ఫాలో‌ఆన్ ఆడించాలని చాలా ట్రై చేసిన ఇంగ్లాండ్‌కి ఆ ఆశ నెరవేరలేదు. దాంతో.. చివరి రోజు ఆ జట్టుకి భారీ లక్ష్యాన్ని నిర్దేశించడం ద్వారా ఒత్తిడిలోకి నెట్టే అవకాశం ఉంది.

Samayam Telugu 20 Jul 2020, 8:17 am
ఇంగ్లాండ్‌తో మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ పోరాడుతోంది. గురువారం ఆరంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్.. మొదటి ఇన్నింగ్స్‌ని 469/9తో డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్.. ఆదివారం 287 పరుగులకి ఆలౌటవగా.. ఇంగ్లాండ్‌కి 182 పరుగుల ఆధిక్యం లభించింది. మ్యాచ్‌ సోమవారం ఆఖరి‌కాగా.. ఆదివారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 37/2తో నిలిచింది. మొత్తంగా.. ఆతిథ్య జట్టు ఆధిక్యం 219 పరుగులు.
Samayam Telugu England v West Indies


మ్యాచ్‌లో తొలి రోజు, మూడో రోజు వర్షం అంతరాయం కలిగించగా.. వెస్టిండీస్‌ని ఫాలో‌ఆన్ ఆడించాలని ఇంగ్లాండ్ విశ్వ ప్రయత్నం చేసింది. కానీ.. ఆ జట్టు ఓపెనర్ క్రైగ్ బ్రాత్‌వైట్ (75), బ్రూక్స్ (68), రోస్టన్ ఛేజ్ (51) పోరాట పటిమతో ఆకట్టుకున్నారు. దాంతో.. కొద్దిలో ఫాలో‌ఆన్‌ని తప్పించుకున్న వెస్టిండీస్‌కి సోమవారం ఎంత టార్గెట్‌ని ఇంగ్లాండ్ నిర్దేశిస్తుందో..? చూడాలి.

మ్యాచ్‌లో మూడు సెషన్లు మాత్రమే మిగిలి ఉండగా.. ఈరోజు తొలి సెషన్‌ ఆఖరి వరకూ ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో దూకుడుగా ఆడి కనీసం 300 పరుగుల టార్గెట్‌ని నిర్దేశించే సూచనలు కనిపిస్తున్నాయి. తొలి టెస్టులో 200 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్ల కోల్పోయి వెస్టిండీస్ ఛేదించిన విషయం తెలిసిందే. దాంతో.. మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో ఉన్న కరీబియన్లు.. డ్రా కోసం ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.