ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న ‘ది హండ్రెడ్’ టోర్నీలో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ హస్నైన్ బౌలింగ్ యాక్షన్పై ఆస్ట్రేలియా పవర్ హిట్టర్ మార్కస్ స్టాయినిస్ ఫిర్యాదు చేశాడు. ఈ టోర్నీలో సౌథరెన్ బ్రేవ్ టీమ్ తరఫున స్టాయినిస్ ఆడుతుండగా.. ఓవెల్ ఇన్విన్సెబెల్ టీమ్కి పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ హస్నైన్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇది హండ్రెడ్ బాల్ క్రికెట్ టోర్నీ. మ్యాచ్లో 27 బంతుల్లో 2x4, 2x6 సాయంతో 37 పరుగులు చేసిన మార్కస్ స్టాయినిస్ టీమ్ స్కోరు 69 వద్ద మహ్మద్ బౌలింగ్లో ఔటైపోయాడు. ఔటైపోయిన తర్వాత పెవిలియన్కి వెళ్తున్న స్టాయినిస్ అంపైర్ వైపు చూస్తూ మహ్మద్ నిబంధనలకి విరుద్ధంగా బౌలింగ్ చేస్తున్నాడంటూ సైగలు చేశాడు. వాస్తవానికి మహ్మద్ బౌలింగ్పై ఫిర్యాదు రావడం ఇదేమీ తొలిసారి కాదు. బిగ్బాష్ లీగ్ 2021-22 సీజన్లో మహ్మద్ బౌలింగ్పై అంపైర్ గెరార్డ్ అబూడ్ ఫిర్యాదు చేయగా అప్పట్లో ఐసీసీ అతని బౌలింగ్ని నిషేధించింది.
గంటకి 140 కిమీ వేగంతో బౌలింగ్ చేసే మహ్మద్ తన మోచేతిని 15 డిగ్రీలకి మించి వంచుతున్నాడని అంపైర్ ఫిర్యాదు చేశాడు. దాంతో.. ఈ ఏడాది జనవరిలో బయోమోకానిక్ టెస్టుకి హాజరైన మహ్మద్ని పరీక్షించిన లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్స్ .. అతని బౌలింగ్ ఐసీసీ నిబంధనలకి లోబడే ఉందని తేల్చి చెప్పింది. దాంతో ఈ ఏడాది జూన్ నుంచి అతను మళ్లీ అన్ని ఫార్మాట్లలోనూ క్రికెట్ ఆడుతున్నాడు. కానీ తాజాగా మార్కస్ స్టాయినిస్ పరోక్షంగా ఫిర్యాదు చేయడంతో మళ్లీ అందరి చూపు మహ్మద్ బౌలింగ్ వైపు మళ్లింది.
గంటకి 140 కిమీ వేగంతో బౌలింగ్ చేసే మహ్మద్ తన మోచేతిని 15 డిగ్రీలకి మించి వంచుతున్నాడని అంపైర్ ఫిర్యాదు చేశాడు. దాంతో.. ఈ ఏడాది జనవరిలో బయోమోకానిక్ టెస్టుకి హాజరైన మహ్మద్ని పరీక్షించిన లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్స్ .. అతని బౌలింగ్ ఐసీసీ నిబంధనలకి లోబడే ఉందని తేల్చి చెప్పింది. దాంతో ఈ ఏడాది జూన్ నుంచి అతను మళ్లీ అన్ని ఫార్మాట్లలోనూ క్రికెట్ ఆడుతున్నాడు. కానీ తాజాగా మార్కస్ స్టాయినిస్ పరోక్షంగా ఫిర్యాదు చేయడంతో మళ్లీ అందరి చూపు మహ్మద్ బౌలింగ్ వైపు మళ్లింది.