ఐదు వన్డేల సిరీస్లో భాగంగా వెస్టిండీస్తో గౌహతిలో జరుగుతోన్న తొలి వన్డేలో భారత బౌలర్లు ఆకట్టుకుంటున్నారు. విండీస్ ఓపెనర్లు కీరన్ పావెల్ (39 బంతుల్లో 51), చంద్రపాల్ హేమ్రాజ్ (15 బంతుల్లో 9) సహా సీనియర్ బ్యాట్స్మన్ మార్లోన్ శామ్యూల్స్, షాయి హోప్(51 బంతుల్లో 32)లను పెవిలియన్కు పంపారు. శామ్యూల్స్ డకౌట్ అయ్యాడు. శామ్యూల్స్కు ఇది 200వ వన్డే కావడం విశేషం. తన 200వ వన్డే మ్యాచ్లో రెండు బంతులాడి శామ్యూల్స్ డకౌట్గా వెనుదిరిగాడు. యజ్వేంద్ర చాహల్ వేసిన ఆట 15వ ఓవర్లో శామ్యూల్స్ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.
అయితే, ప్రపంచంలోనే 200వ వన్డేలో డకౌట్ అయిన ఎనిమిదో బ్యాట్స్మన్గా శామ్యూల్స్ నిలిచాడు. గతంలో రోషన్ మహానామ, బ్రియాన్ లారా, క్రిస్ కెయిన్స్, ఆడమ్ గిల్క్రిస్ట్, అబ్దుల్ రజాక్, హర్భజన్ సింగ్, షోయబ్ మాలిక్ తమ 200వ వన్డేలో డకౌట్ అయ్యారు. ఇదిలా ఉంటే, వెస్టిండీస్ తరఫున 200 వన్డేలు ఆడిన ఎనిమిదో బ్యాట్స్మన్గానూ శామ్యూల్స్ రికార్డులకెక్కాడు. విండీస్ తరఫున బ్రియాన్ లారా అత్యధికంగా 295 వన్డేలు ఆడాడు. ఆ తరవాత స్థానంలో క్రిస్ గేల్ (281) ఉన్నాడు. చందర్పాల్ 268, హేన్స్ 238, కార్ల్ హూపర్ 227, రిచర్డ్సన్ 224 మ్యాచ్లు ఆడి శామ్యూల్స్ కంటే ముందున్నారు.
నేటి మ్యాచ్లో భారత బౌలింగ్ను వెస్టిండీస్ దీటుగా ఎదుర్కొంటోంది. దూకుడుగా ఆడిన ఓపెనర్ కీరన్ పావెల్.. భారీ షాట్కు ప్రయత్నించి ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో ధావన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ హేమ్రాజ్ను షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తరవాత శామ్యూల్స్ను చాహల్ డకౌట్ చేశాడు. ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తోన్న షాయి హోప్ను షమీ బోల్తా కొట్టించాడు. ప్రస్తుతం క్రీజులో షిమ్రోన్ (22 బ్యాటింగ్), రోవ్మన్ పావెల్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదేస్తున్నారు. 22 ఓవర్లు ముగిసే సరికి విండీస్ 4 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది.
అయితే, ప్రపంచంలోనే 200వ వన్డేలో డకౌట్ అయిన ఎనిమిదో బ్యాట్స్మన్గా శామ్యూల్స్ నిలిచాడు. గతంలో రోషన్ మహానామ, బ్రియాన్ లారా, క్రిస్ కెయిన్స్, ఆడమ్ గిల్క్రిస్ట్, అబ్దుల్ రజాక్, హర్భజన్ సింగ్, షోయబ్ మాలిక్ తమ 200వ వన్డేలో డకౌట్ అయ్యారు. ఇదిలా ఉంటే, వెస్టిండీస్ తరఫున 200 వన్డేలు ఆడిన ఎనిమిదో బ్యాట్స్మన్గానూ శామ్యూల్స్ రికార్డులకెక్కాడు. విండీస్ తరఫున బ్రియాన్ లారా అత్యధికంగా 295 వన్డేలు ఆడాడు. ఆ తరవాత స్థానంలో క్రిస్ గేల్ (281) ఉన్నాడు. చందర్పాల్ 268, హేన్స్ 238, కార్ల్ హూపర్ 227, రిచర్డ్సన్ 224 మ్యాచ్లు ఆడి శామ్యూల్స్ కంటే ముందున్నారు.
నేటి మ్యాచ్లో భారత బౌలింగ్ను వెస్టిండీస్ దీటుగా ఎదుర్కొంటోంది. దూకుడుగా ఆడిన ఓపెనర్ కీరన్ పావెల్.. భారీ షాట్కు ప్రయత్నించి ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో ధావన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ హేమ్రాజ్ను షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తరవాత శామ్యూల్స్ను చాహల్ డకౌట్ చేశాడు. ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తోన్న షాయి హోప్ను షమీ బోల్తా కొట్టించాడు. ప్రస్తుతం క్రీజులో షిమ్రోన్ (22 బ్యాటింగ్), రోవ్మన్ పావెల్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదేస్తున్నారు. 22 ఓవర్లు ముగిసే సరికి విండీస్ 4 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది.